Site icon PRASHNA AYUDHAM

రెవెన్యూ డే వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్. ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి 

IMG 20250620 WA2031

*రెవెన్యూ డే వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్. ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి

పార్వతీపురం మన్యం జిల్లా ప్రతినిధి జూన్ 20 ( ప్రశ్న ఆయుధం న్యూస్ ) దత్తి మహేశ్వరరావు

గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో ఎమ్మార్వో కార్యాలయంలో శుక్రవారం నాడు ఎమ్మార్వో అప్పారావు ఆధ్వర్యంలో ఘనంగా రెవెన్యూ డే వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్ మరియు కురుపాం ఎమ్మెల్యే *తోయక జగదీశ్వరి* హాజరయ్యారు. ఈ కార్యాలయం ద్వారా మండల ప్రజలకు విశిష్ట సేవలు అందిస్తున్న రెవెన్యూ సిబ్బందికి ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు. సీనియర్ రెవెన్యూ ఉద్యోగులను సన్మానించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పాడి సుదర్శనరావు, ఏఎంసీ చైర్పర్సన్ కడ్రక కళావతి, గుమ్మలక్ష్మీపురం సర్పంచ్ బొత్తాడ గౌరీ శంకర్రావు, గిరిజన నాయకులు నిమ్మక సింహాచలం, చెముడుగూడ ఎంపీటీసీ మండంగి రమణ, రెల్ల సర్పంచ్ మండంగి శంకర్ రావు, రెవెన్యూ, ఎంపీడీవోపంచాయితీ, సచివాలయ సిబ్బంది, తదితరులు ఉన్నారు.

Exit mobile version