వక్ఫబిల్ చట్టం చట్టబద్ధతపై సుప్రీం
కోర్టులో కేసు వేసిన షబ్బీర్ అలీ
– విచారణ ప్రారంభించిన సుప్రీంకోర్టు
ప్రశ్న ఆయుధం – కామారెడ్డి
కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ల ఆదేశాల మేరకు సుప్రీంకోర్టులో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ సుప్రీంకోర్టులో కేసు వేయగా ఆ కేసును సుప్రీంకోర్టు గురువారం విచారణను ప్రారంభించింది. ఈ కేసును వాదిస్తున్న సల్మాన్ ఖుర్షీద్ బృందం ను షబ్బీర్ అలీ కలిసి కేసుకు సంబంధించిన అంశాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ వక్ఫ్ (సవరణ)చట్టం – 2025 చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం బుధవారం ప్రారంభించింది అన్నారు. సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం పిటిషన్లపై విచారణ చేపట్టింది అన్నారు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం సైతం కేవియెట్ దాఖలు చేసిందన్నారు. విచారణకు ముందు సుప్రీంకోర్టు తమ ఎదుట రెండు ప్రశ్నలు ఉన్నాయని పేర్కొంది. మొదటిది కేసును విచారించాలా ? లేదంటే హైకోర్టుకు అప్పగించాలా ? అని, రెండోది న్యాయవాదులు వాదించాలనుకుంటున్న అంశాలపై తెలిపిందన్నారు. ఓ పిటిషనర్ తరఫున తమ సీనియర్ న్యాయవాదుల బృందం వాదనలు వినిపించారు. పార్లమెంట్ చట్టం ద్వారా మత విశ్వాసంలో కీలకమైన అంతర్భాగ అంశాల్లో తలదూర్చడమే అన్నారు. ఆర్టికల్ 25, 26 లకు వ్యతిరేకంగా వక్ఫ్ సవరణ చట్టం ఉందని సుప్రీంకోర్టుకు తెలిపాము అన్నారు. చట్టం ప్రకారం’ అనే పదాలు అనే పదాలు ముస్లిం మతానికి సంబంధించిన ముఖ్యమైన ఆచారాన్ని ప్రభావితం చేస్తాయన్నారు. ఈ పదబంధం ఇస్లాం మతానికి సంబంధించి మౌలికమైన ఆచారాలను దూరం చేస్తుందని పేర్కొన్నారు. వక్ఫ్ – అలల్ – ఔలాద్ను సృష్టించినప్పుడు మహిళల వారసత్వ హక్కులను నిరాకరించరాదని. దీనిపై ప్రభుత్వం ఎలా నిర్ణయం తీసుకోగలదన్నారు. ఎవరైనా వక్ఫ్ను స్థాపించాలనుకుంటే. అతను ఐదేళ్లు ఇస్లాంను పాటిస్తున్నాడని నిరూపించుకోవాల్సి ఉందన్నారు. ఆస్తుల సర్వే బాధ్యత కలెక్టర్కు ఇచ్చారని, ఇది రాజ్యాంగ విరుద్ధమన్నారు. గతంలో ముస్లింలు మాత్రమే వక్ఫ్ కౌన్సిల్, బోర్డులో భాగమని సవరణ తర్వాత హిందువులు కూడా భాగం కావొచ్చని, ఇది పార్లమెంటరీ చట్టం ప్రాథమిక హక్కులను ప్రత్యక్షంగా ఉల్లంఘించడమేనన్నారు. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుపై మాకు పూర్తి స్థాయి నమ్మకం ఉందని తప్పకుండా మాకు న్యాయం జరుగుతుందన్నారు.