Site icon PRASHNA AYUDHAM

వైసీపీ కార్యకర్త ప్రాణాలకు విలువ ఎంత?

IMG 20250619 WA1198

*వైసీపీ కార్యకర్త ప్రాణాలకు విలువ ఎంత?*

జగన్ రెడ్డి పగటి వేషాలకు ఇద్దరు సొంత పార్టీ కార్యకర్తలు చనిపోయారు. ఒకరు దళితుడు, మరొకరు రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారు. వారు చనిపోయిప్పుడు మాకెందుకులే అని కార్యకర్తలు, నేతలు రోడ్డు మీద పడేసి వెళ్లిపోతే.. పోలీసులు, మున్సిపాల్టీ వాళ్లు ఆటోల్లో తీసుకెళ్లాల్సి వచ్చింది. కనీసం తన పర్యటనలో ఇద్దరు చనిపోయారన్న నిజం తెలిసినా తెలియనట్లుగా జగన్ నటించి వెళ్లిపోయారు. ఇద్దరు ప్రాణాలకు వైసీపీ ఇచ్చే విలువ అంతేనా ?

*సత్తెనపల్లి రెడ్డి కార్యకర్త ప్రాణం బలి*

సత్తెనపల్లిలో జగన్ కాన్వాయ్ ముందు కారుకు వేలాడిపడి వెళ్లిన యువకుడు..కాసేపటికి చనిపోయాడు. రోడ్డంతా ఖాళీగా ఉన్నా.. జగన్ రెడ్డి ముందు తోసుకోవాలన్న కాన్సెప్ట్ ను అమలు చేసే క్రమంలో ఆ వ్యక్తి ఊపిరి కోల్పోయాడు. అతడిని ఆస్పత్రికి కూడా తీసుకెళ్లలేదు. అంబులెన్స్ ను కూడా పిలవలేదు. బైక్ మీద ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే అప్పటికే చనిపోయాడని తెలిసిందేమో కానీ.. పక్కన పెట్టేశారు. మున్సిపాల్టీకి చెందిన వారు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే చనిపోయారు. ఒక్క వైసీపీ నేత కూడా చూడటానికి రాలేదు. పట్టించుకోలేదు.

*గుంటూరు దళిత కార్యకర్త మృతి*

గుంటూరులో వెంగళాయపాలెనికి చెందిన దళిత కార్యకర్త.. జగన్ వస్తున్నాడని తమ పార్టీ నేతలు విస్తృతంగా ప్రచారం చేయడంతో చూడటానికి వెళ్లారు. ప్రాణాలు కోల్పోయారు. తాము వైసీపీకి చెందిన వాళ్లమేనని జగన్ ను చూడటానికి వెళ్లే ఇలా చంపేస్తారని అనుకోలేదని ఆ కుటుంబం కన్నీరు మున్నీరవుతోంది. తమ కుటుంబానికి దిక్కెవరని ఆ కుటుంబం వేదన చెందుతోంది.

*మానవత్వం అనేదే లేదు !*

నరుకుతాం.. చంపుతాం అని పోస్టర్లు వేయించారు. కానీ అప్పుడే బలయిపోతున్న కార్యకర్తలను కనీసం పట్టించుకోవాలన్న ఆలోచన చేయలేదు. జగన్ రెడ్డి తన రాజకీయాల్ని .. ఇతరుల్ని బలి చేసి.. వారి శవాల మీద నుంచి వెళ్లేలా చేసుకుంటారు. తన పాలనలో అందర్నీ బలి చేసి ఇప్పుడు పర్యటనలు చేస్తున్నారు. ఆ రెండు కుటుంబాలను కనీసం పట్టించుకునేవారు లేరు. వైసీపీ కార్యకర్తలకు ఈ ఇద్దరి మరణాలు.. జగన్ రెడ్డితీరు ఓ మేలుకొలుపు కావాల్సి ఉంది.

Exit mobile version