Site icon PRASHNA AYUDHAM

ఈ నెల 6న వీరశైవ లింగాయత్ లింగ బలిజ ఆత్మీయ సమ్మేళనం

IMG 20251005 184620

Oplus_131072

సంగారెడ్డి, అక్టోబర్ 5 (ప్రశ్న ఆయుధం న్యూస్): రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం సంగారెడ్డి జిల్లా ఆత్మీయ సమ్మేళనం (అలయ్ బలయ్) కార్యక్రమం ఈ నెల 6న ఏర్పాటు చేసినట్లు అధ్యక్షుడు పృథ్వీరాజ్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. పోతిరెడ్డిపల్లి చౌరస్తా విద్యానగర్ కాలనీ రోడ్ నెంబర్ మూడులో గల విద్యానగర్ కమ్యూనిటీ హాల్ లో దసరా పండుగ పురస్కరించుకుని సోమవారం సాయంత్రం 5 గంటలకు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో లింగాయత్ బంధుమిత్రులందరూ హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు ధనంజయ, ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల మల్లికార్జున్ పాటిల్, ఉపాధ్యక్షుడు రాజేశ్వర స్వామి, ఉప కోశాధికారి శివకుమార్, కార్యదర్శులు శరణు బసవేశ్వర్, శివ కుమార్, గౌలీశ్వర్, మహిళా కమిటీ ఉపాధ్యక్షురాలు వీరమనమ్మ, నిర్మల తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version