నాగారం మున్సిపాలిటీలో 100 రోజుల ప్రణాళికలో భాగంగా పలు అభివృద్ధి పనులు

*నాగారం మున్సిపాలిటీలో 100 రోజుల ప్రణాళికలో భాగంగా పలు అభివృద్ధి పనులు*

మేడ్చల్ జిల్లా నాగారం ప్రశ్న ఆయుధం జూన్ 19

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ 100 రోజుల ప్రణాళికలో భాగంగా మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీ పరిధిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు గురువారం విజయవంతంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్, సిడిఎమ్ఏ జ్యోష్న, మున్సిపల్ కమిషనర్ ఎస్. భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో పాల్గొన్నారు.

ముందుగా 3వ వార్డులోని పార్కులో బ్లాక్ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించి మొక్కలు నాటారు. అనంతరం వీధి కుక్కల నియంత్రణపై దృష్టి సారించి, ఏ బీ సి కెనాల్‌ను సందర్శించిన జ్యోష్న, అవి పిల్లలు కనకుండా తక్షణమే స్టెరిలైజేషన్ ఆపరేషన్లు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కంపోస్ట్ తయారీ కేంద్రాన్ని పరిశీలించిన ఆమె, అక్కడ నిల్వవుతున్న వృథా నీరు బయటకు పోయేలా డ్రైనేజీ లైను ఏర్పాటు చేయాలని డీఈకి సూచనలు చేశారు.

మహిళా సంఘాల సమైక్య సభ్యులతో సమావేశం నిర్వహించిన మేడం జ్యోష్న, వారు తయారు చేస్తున్న ఉత్పత్తులపై వారి సంఘాల పేర్లు, చిరునామాలు, ఫోన్ నెంబర్లు స్పష్టంగా ముద్రించాలని సూచించారు. ఉత్పత్తుల ప్రాముఖ్యతను ప్రజల్లోకి చాటి ప్రచారం చేసి అమ్మకాలపై దృష్టి పెట్టాలని కూడా ఆమె తెలిపారు. మహిళా సమాఖ్య, సర్ఫ్ సంస్థలు తయారు చేసిన వంటల ప్రదర్శనను ప్రాజెక్ట్ డైరెక్టర్ సందర్శించి తమ హర్షం వ్యక్తం చేశారు.

అదేవిధంగా మురికి కాలువలోని రీసల్టింగ్ వాటర్ పరిస్థితిని పరిశీలించి, రైలింగ్ మరియు మెష్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని జ్యోష్న సూచించారు. దీనిపై స్పందించిన కమిషనర్, “ఇది రోడ్డు వైడెనింగ్ పనుల్లో భాగంగా ఉన్నందున, అందుకే మెష్ తీయడం జరిగిందని” వివరించారు. ఇదే క్రమంలో, వర్తక వ్యాపార లైసెన్సుల అంశాలపై పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన ఆమె, న్యూరల్ పెయింటింగ్ పనులను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు.

మున్సిపాలిటీలోని నర్సరీని సందర్శించిన ఆమె, “చెట్లు పెద్దగా పెరిగి ఉన్నప్పటికీ, మీరు పార్కులు ఏర్పాటయ్యే ఇండస్ట్రియల్ ఏరియాలోనే మొక్కలు నాటాలని చూడాలి” అని అధికారులకు సూచించారు. ఈ అభివృద్ధి చర్యలు ప్రజలలో మంచి స్పందనను రేకెత్తించాయి. ప్రభుత్వ ప్రణాళికల అమలు పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment