నిజాంసాగర్ చౌరస్తా ట్రాఫిక్ సిగ్నల్స్ పరిశీలన
కామారెడ్డి టౌన్లో వాహన రాకపోకల సాఫల్యం కోసం జిల్లా ఎస్పీ సూచనలు
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
(ప్రశ్న ఆయుధం) సెప్టెంబర్ 30
కామారెడ్డి పట్టణంలో ట్రాఫిక్ వ్యవస్థను మెరుగుపరిచే చర్యల్లో భాగంగా జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర , సోమవారం నిజాంసాగర్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్స్ను ప్రత్యక్షంగా పరిశీలించారు. న్యూ బస్టాండ్, లింగంపేట్, ఎల్లారెడ్డి వైపు వెళ్లే వాహన రాకపోకలు సజావుగా సాగేందుకు అవసరమైన సూచనలు సంబంధిత అధికారులకు అందజేశారు. సిగ్నల్స్ వినియోగం సమర్ధవంతంగా ఉండేలా ట్రాఫిక్ పోలీసులు మరింత కృషి చేయాలని ఆదేశించారు.