ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి – కలెక్టర్ మను చౌదరి

ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి – కలెక్టర్ మను చౌదరి

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రశ్న ఆయుధం ఆగస్టు 11

ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులను జాప్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరు మిక్కిలినేని మను చౌదరి అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమానికి ఎంతో నమ్మకంతో ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం వస్తారని, వారి నమ్మకాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఆయన అన్నారు.సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రాధిక గుప్తా, విజయేందర్ రెడ్డితో కలిసి కలెక్టరు 71 దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దరఖాస్తుల పరిశీలనలో ఎటువంటి జాప్యం ఉండకూడదని స్పష్టం చేశారు. దరఖాస్తులను తిరస్కరించాల్సి వస్తే, కారణాలను దరఖాస్తుదారులకు తప్పనిసరిగా వివరించాలని సూచించారు.స్వీకరించిన దరఖాస్తులపై తీసుకున్న చర్యలను వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని కూడా కలెక్టరు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now