12 లక్షలు ఎత్తుకెళ్లిన దుండగులు..

వైన్ షాపులో దూరి రూ.12 లక్షలు ఎత్తుకెళ్లిన దుండగులు..

నల్గొండ జిల్లా గుర్రంపోడు మండల కేంద్రంలోని ఓ మద్యం దుకాణంలో చోరీ జరిగింది. శనివారం అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తి దుకాణం పైకప్పు రేకులు పగులగొట్టి లోనికి ప్రవేశించి సుమారు రూ.12 లక్షలు నగదు ఎత్తుకెళ్లాడు. శుక్ర, శనివారం రెండు రోజుల కలెక్షన్ డబ్బు గల్లా పెట్టెలో ఉన్నాయి. దుండగుడు డబ్బు లెక్క పెట్టుకోవడం సీసీ కెమెరా ఫుటేజ్‌లో కనిపించింది. ఉదయం వైన్స్ షాపు తెరవడానికి వచ్చిన నిర్వాహకులు మద్యం దుకాణం తెరిచి చూడగా దొంగతనం జరిగినట్లుగా గుర్తించారు..

Join WhatsApp

Join Now