ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చుతా
మెదక్ నియోజక వర్గంలో బీటి రోడ్లకు 15 కోట్లు మంజూరు
మెదక్ నియోజక వర్గ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చుతానని మెదక్ నియోజక వర్గ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ అన్నారు. మెదక్ నియోజక వర్గంలోని అన్ని మండలాలకు సంబంధించిన బీటి రోడ్లకు మొత్తంగా 15 కోట్లు మంజూరు అయ్యాయని ఆయన పేర్కోన్నారు. నియోజక వర్గంలోని ప్రతి పల్లెలో కూడా రోడ్డు లేకుండా ఏ పల్లె కూడా ఉండద్దు అనే లక్ష్యంతో పనిచేస్తానని ఆయన తెలిపారు. అంతే కాకుండా మెదక్ ప్రాంత అభివృద్ధికి అహర్నిషలు కృషి చేస్తానని పేర్కోన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలన్నింటిని సత్వరమే పూర్తి చేస్తానని ఆయన పేర్కోన్నారు.