*ఒకే ఇంట్లో 30 కరెంట్ మీటర్లు…*
*రెండేండ్లుగా బిల్లులూ కడుతున్నడు..ఎందుకని అడగ్గా..*
ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి వాటి సాయంతో రెగ్యులరైజేషన్ చేసుకునేందుకే..
మీటర్లు స్వాధీనం.. నిందితుడు అరెస్ట్స్థానిక అధికారులు,సిబ్బంది చేతివాటం
ఇప్పటివరకు అక్రమ కనెక్షన్లు ఇచ్చుకుని కరెంట్ బిల్లులు ఎగ్గొట్టేవాళ్లను చూశాం.. కానీ, దుండిగల్ పరిధిలో ఓ వ్యక్తి అక్రమంగా ఏకంగా 30 విద్యుత్ మీటర్లు తీసుకుని ప్రతినెలా క్రమం తప్పకుండా మినిమం బిల్లులు చెల్లిస్తూ వస్తున్నాడు. రెండేండ్లుగా ఈ తతంగం సాగుతుండగా.. పోలీస్, విద్యుత్శాఖాధికారులు ఆదివారం రైడ్ చేసి పట్టుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపారు. ఎలక్ట్రికల్ ఏఈ శ్రీసాయి ఫిర్యాదు మేరకు దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధి సర్వే నెంబర్ 454, పల్లవి ఆశ్రమం దగ్గరలోని ఓ ప్రభుత్వ భూమి వద్ద ఎలక్ట్రికల్ సిబ్బంది, పోలీసులు దాడులు జరిపారు.
వేణు గోపాల్ అనే వ్యక్తికి చెందిన ఇంట్లోని ఓ గదిలో 30 విద్యుత్ మీటర్లు గుర్తించారు. వాటికి రెండు సంవత్సరాలుగా బిల్లులు చెల్లిస్తున్నట్టు తేలింది. ఎటువంటి ఇంటి నెంబర్లు లేకుండా ఎలక్ట్రిక్ మీటర్లకు పర్మిషన్లు పొందాడు.