*ఏపీ రాష్ట్రానికి రానున్న 6 కుంకీ ఏనుగులు*
*ఏపీలో రైతుల కష్టాలకు త్వరలో పరిష్కారం*
అమరావతి :
ఈనెల 21న ఏపీ రాష్ట్రానికి 6 కుంకీ ఏనుగులు రానున్నాయి. బెంగళూరు లోని విధానసౌధ వద్ద కర్ణాటక సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం శివకుమార్, పవన్ కళ్యాణ్ సమక్షం లో ఈ కార్యక్రమం ఉంటుంది. గతేడాది ఆగస్టులో కుంకీ ఏనుగులు కావాలని కర్ణాటక ప్రభుత్వాన్ని పవన్ కోరారు. ఈ నేపథ్యంలోనే సిద్దరామయ్య సర్కారు వీటిని అప్పగించనుంది. రైతుల పంట పొలాలను నాశనం చేస్తున్న అడవి ఏనుగులను అదుపు చేసేందుకు ఈ కుంకీ ఏనుగులను వాడతారు.