ప్రశ్న ఆయుధం న్యూస్ అశ్వరావుపేట ఆర్సి 24

అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే *జారె ఆదినారాయణ* చండ్రుగొండ రైతు వేదిక వద్ద ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సహాయంతో ఎంతో మంది ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు ప్రయోజనం పొందుతున్నట్లు తెలిపారు.
చెక్కుల పంపిణీ కార్యక్రమం సందర్భంగా పలువురు లబ్ధిదారులు ఎమ్మెల్యేని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రతి ఇంటికి చేరాలన్నదే తన లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అనంతరం 50 శాతం సబ్సిడీతో ప్రభుత్వం అందిస్తున్న జనుము జీలుగు విత్తనాలను రైతులకు పంపిణీ చేశారు.అనంతరం మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయుల వృత్యంతర శిక్షణ కేంద్రాన్ని సందర్శించారు. శిక్షణ పొందుతున్న ఉపాధ్యాయులతో ఆయన నేరుగా సంభాషించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ప్రాముఖ్యమైందన్నారు. నూతన శిక్షణా పద్ధతులు విద్యా విధానాల్లో వస్తున్న మార్పులను ఉపాధ్యాయులు అర్థం చేసుకుని విద్యార్థులకి నాణ్యతమైన విద్యను అందించాలని సూచించారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి విధ్యాభివృద్ధి ప్రధాన ప్రాధాన్యత అని పేర్కొంటూ ఉపాధ్యాయులు కూడా తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలన్నారు.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పలువురు ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now