బాధిత కుటుంబాల్ని పరామర్శించిన కురుపాం నియోజకవర్గ జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కడ్రక మల్లేష్
పార్వతీపురం మన్యం జిల్లా ప్రతినిధి జులై 17 ( ప్రశ్న ఆయుధం న్యూస్) దత్తి మహేశ్వరరావు
గుమ్మలక్ష్మీపురం మండలం, బాతుగుడబ గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలు మండంగి కుంబు, మండంగి గౌరీ శనివారం నాడు పిడుగుపాటుకు గురై పార్వతీపురం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు, వారిని *కురుపాం నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త కడ్రక మల్లేశ్వరరావు,* కురుపాం మండల పార్టీ అధ్యక్షులు నేరేడుబిల్లి వంశి, కొమరాడ మండల పార్టీ అధ్యక్షులు తెంటు శ్రీకర్, జిఎం వలస మండల నాయకులు దుక్క చిన్న పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని మెరుగైన వైద్యం అందించమని ఆసుపత్రి సిబ్బందికి చెప్పి, మీకు కుటుంబాలకు జనసేన పార్టీ , నాయకులు ఎప్పుడు అందుబాటులో ఉంటారు అని చెప్పి వారికి ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది.