Site icon PRASHNA AYUDHAM

టర్కీలో 9 కోట్ల లగ్జరీ షిప్ తొలి ప్రయాణంలోనే మునిగింది

Screenshot 2025 09 05 20 03 20 63 6012fa4d4ddec268fc5c7112cbb265e7

 టర్కీలో 9 కోట్ల లగ్జరీ షిప్ తొలి ప్రయాణంలోనే మునిగింది

టర్కీలో కొత్తగా ప్రారంభించిన లగ్జరీ షిప్ తొలి ప్రయాణంలోనే క్షణాల్లో మునిగిపోయింది.

సుమారు రూ.9 కోట్ల విలువైన 85 అడుగుల పొడవైన నౌక.

ప్రయాణం మొదలై కేవలం 15 నిమిషాలకే లోపం తలెత్తి సముద్రంలో మునక.

యజమాని, కెప్టెన్, సిబ్బంది ఈదుకుంటూ ఒడ్డుకు చేరి ప్రాణాలు దక్కించుకున్నారు.

తొలి ప్రయాణమే చివరి ప్రయాణమైపోయి కలల నౌక శిధిలమైంది.

కలల నౌక క్షణాల్లో శిధిలం

టర్కీలో కొత్తగా నిర్మించిన 85 అడుగుల పొడవైన లగ్జరీ షిప్ తన తొలి ప్రయాణంలోనే మునిగిపోవడం కలకలం రేపింది. సుమారు రూ.9 కోట్ల ఖరీదైన ఈ నౌక కేవలం 15 నిమిషాల ప్రయాణానికే లోపం తలెత్తి నీటిలో మునిగిపోయింది.

అప్పటివరకు ఆనందంగా సాగుతున్న ప్రారంభోత్సవం క్షణాల్లో విషాదకరంగా మారింది. నౌక యజమాని, కెప్టెన్, సిబ్బంది చివరి క్షణాల్లో ఓడను వదిలేసి ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు.

ప్రాణాపాయం తప్పించుకున్నా, కలల నౌక తొలి ప్రయాణమే చివరి ప్రయాణమైపోయింది. “క్షణాల్లో మునిగిపోయింది” అని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు

 

 

Exit mobile version