భం భం భోలే… హర హర మహాదేవ!.భం భం భోలే… హర హర మహాదేవ!.
శ్రావణ మాసం పురస్కరించుకుని పటాన్చెరులో నిర్వహించిన బోల్ భం కావడి యాత్ర కార్యక్రమంలో BRS నాయకులు మాదిరి ప్రిథ్వీరాజ్ గారు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు, మరియు మహాప్రసాదాన్ని వితరణ చేశారు.
శ్రావణ మాసం ఆరంభాన్ని పురస్కరించుకుని పటాన్చెరు పట్టణంలోని అల్విన్ కాలనీలో ఒడిశా వాసుల ఆధ్వర్యంలో శివనామస్మరణతో నిండిన బోల్ భం కావడి యాత్ర నిర్వహించబడింది. ఈ యాత్ర భక్తి, శ్రద్ధ, ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలిచింది.ఇంద్రేశం గ్రామంలోని శివాలయం నుంచి ప్రారంభమైన ఈ యాత్ర ఆలయ ఘంటాధ్వనులు, భజనలు, డప్పులు, శంఖనాదాలతో సాగింది. భక్తులు “భం భం భోలే… హర హర మహాదేవ! శంభో శంకర!” అంటూ శివుని నామస్మరణలో పాల్గొన్నారు. పవిత్ర గంగ జలాన్ని మోస్తూ, కావడిని భుజాన వేసుకుని అల్విన్ కాలనీ శివాలయం వరకు పాదయాత్రగా చేరుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన BRS నాయకులు మాదిరి ప్రిథ్వీరాజ్ గారు శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు స్వయంగా మహాప్రసాదాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా ప్రిథ్వీరాజ్ గారు మాట్లాడుతూ పటాన్చెరు అనేది మినీ ఇండియా లాంటిది, దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు ఇక్కడ ఐక్యతతో నివసిస్తున్నారు. శ్రావణ మాసం కాలంలో ఒడిశా వాసులు భక్తితో నిర్వహించిన ఈ బోల్ భం కావడి యాత్ర ఎంతో పవిత్రతను ప్రతిబింబిస్తోంది. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు నా సంపూర్ణ మద్దతు ఉంటుంది, అని తెలిపారు.ఈ యాత్రలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమాన్ని నిర్వహించిన ఒడిశా సంఘ సభ్యులు, స్వయంసేవకులు, యువతకు స్థానికులు అభినందనలు తెలిపారు.