చివరికి జడ్జి ఫోన్ కాల్స్ కూడా విన్నారు: బండి
TG: KCR కొడుకు తన స్వలాభం కోసం ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డాడని బండి సంజయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘రాజకీయ నేతలు, వ్యాపారులు, అధికారులు, ఉస్మానియా ప్రొఫెసర్లతో పాటు చివరికి TGPSC పేపర్ లీకేజీ కేసును విచారిస్తున్న జడ్జి ఫోన్ కాల్స్ కూడా విన్నారు. ప్రభాకర్ రావు అనేవాడు లఫంగి. ఆయనను ఉరి తీయాలి. ఈ కేసులో ఇన్ని ఆధారాలు ఉన్నా KCR కుటుంబాన్ని రేవంత్ సర్కార్ ఎందుకు అరెస్ట్ చేయడం లేదు’ అని ప్రశ్నించారు.