అమరుల స్పూర్తి తో కల్లు గీత వృత్తి రక్షణ కోసం ఉద్యమాలకు సిద్దం అవుదాం.

అమరుల స్పూర్తి తో కల్లు గీత వృత్తి రక్షణ కోసం ఉద్యమాలకు సిద్దం అవుదాం.

– కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట్ గౌడ్

 

తెలంగాణ స్టేట్ ఇంచార్జ్

(ప్రశ్న ఆయుధం) ఆగస్టు 11

 

కామారెడ్డి లో సోమవారం అమరుల యాదిలో గీతన్నల సామాజిక చైతన్య యాత్రలో బాగంగా జరిగిన సమావేశంలో కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట్ గౌడ్ మాట్లాడుతూ కల్లుగీత వృత్తి రక్షించడానికి అనేకమంది వీరులు పోరాటం చేసి హక్కులను సాధించుకున్నారని, అలాంటి హక్కులను ఈనాటి ప్రభుత్వాలు రద్దు చేయాలని చూస్తే కల్లు గీత కార్మికులు ఉద్యమాలకు సిద్దం కావాలని వెంకట్ గౌడ్ కల్లుగీత కార్మికులకు పిపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గీత కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రతి గ్రామానికి ఈత, తాటి చెట్ల పెంచుకోవడానికి పది ఎకరాల భూమిని ఇవ్వాలని, ప్రతి గీత కార్మికుడికి బైక్ ఇవ్వాలని, ప్రతి గ్రామానికి టాటా ఏసీ వెహికల్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కల్లుగీత వృత్తిని నమ్ముకొని ఈరోజు రాష్ట్రంలో మూడు లక్షల మంది ఉన్నారని వృత్తిని రక్షిస్తే మూడు లక్షలతో పాటు ఇంకా ఆదనంగా మూడు లక్షల మంది గౌడ గీత కార్మికులకు దీనిపై పరోక్షంగా బ్రతకడానికి అవకాశం ఉంటుందన్నారు. ఇలాంటి కల్లు గీత వృత్తినీ తొలగించి కేవలం మద్యం ఫ్యాక్టరీల యజమానుల కోసం ప్రభుత్వాలు లాభాల కోసం కల్లు గీత వృత్తిపై కల్తీ పేరిట దాడి చేయడం మంచి పద్ధతి కాదని, కల్లు గీత వృత్తి రక్షణకై నష్టం చేయాలని చూస్తే గీత కార్మిక సంఘం పోరాటాలు సిద్ధమౌతోందని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గౌడ కల్లుగీత కార్మికులు అందరూ ఐక్యంగా వృత్తి రక్షణ పోరాటాలు కు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు బాలా గౌడ్, శేఖర్ గౌడ్, మల్లా గౌడ్, సిద్దగౌడ్, అంజాగౌడ్, గంగాధర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now