బీఆర్ఎస్ నేతలు టీడీపీలోకి – లింగంపేట్లో జోరుగా చేరికలు
కామారెడ్డి జిల్లా లింగంపేట్.ప్రశ్న ఆయుధం.ఆగస్టు 14
లింగంపేట్ మండలంలో బీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. పార్టీ కార్యకర్త తిరుపతి ఆర్ఎంపి డాక్టర్తో పాటు పలువురు కీలక నాయకులు టీడీపీలో చేరారు.మండల టీడీపీ అధ్యక్షులు భీమ్రావు, ఉపాధ్యక్షులు విశ్వేశ్వర్ శర్మ సమక్షంలో చేరికలురాంపల్లి నాణ్య నాయక్, ఐలాపూర్ కమ్మరి కృష్ణ, తిరుమల కిషన్ రాజు తదితరులు పసుపు కండువా కప్పుకున్నారురాబోయే ఎన్నికల్లో టీడీపీ బలోపేతానికి చేరికలు ఊపునిస్తాయని నేతల వ్యాఖ్య బీఆర్ఎస్ నుంచి వలసలు కొనసాగుతాయని టీడీపీ అంచనాటీడీపీ నాయకులు మాట్లాడుతూ, “ప్రజలే మార్పు కోరుతున్నారు… ఈ చేరికలతో లింగంపేట్లో పసుపు జెండా ఎగరడం ఖాయం” అని వ్యాఖ్యానించారు.