వైన్స్ లు  బార్ & రెస్టారెంట్లలో గౌడులకు 25% రిజర్వేషన్లు కల్పించాలి

వైన్స్ లు  బార్ లు మరియు రెస్టారెంట్లలో గౌడులకు 25% రిజర్వేషన్లు కల్పించాలి

జై గౌడ ఉద్యమం జిల్లా అధ్యక్షుడు రంగోల్ల మురళి గౌడ్

ప్రశ్న ఆయుధం ఆగష్టు 24కామారెడ్డి

కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు గౌడ్ లకు ఇచ్చిన హామీ ప్రకారం వైన్స్, బార్ అండ్ రెస్టారెంట్లలో 25% రిసర్వేషన్లు కల్పించాలని జై గౌడ ఉద్యమం ఆధ్వర్యంలో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జై గౌడ ఉద్యమం జిల్లా అధ్యక్షుడు రంగోల్ల మురళిగౌడ్.మాట్లాడుతూ….. తెలంగాణ లో 2 సంవత్సరాలలో తాటి, ఈత చెట్లపై నుండి ప్రమాదానికి గురై, 1145 మంది గీత కార్మికులు చనిపోయారు, తక్షణమే వారి కుటుంబాలకు ఇచ్చిన హామీ ప్రకారం ఒక్కొక కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలన్నారు..జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెట్టాలని డిమాండ్ చేశారు.వైన్ షాపులలో బి.ఆర్.ఎస్ ప్రభుత్వం లో గౌడ్ లకు 15% ఇస్తే, కాంగ్రెస్ పార్టీ 25 % ఇస్తామని హామీ ఇచ్చింది హామీనినిలబెట్టుకోవాలన్నారు . 25% హామీని నెరవేర్చకుండా , 15% ను అమలు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నాము, వెంటనే మానిఫెస్టో లో ఇచ్చిన హామీ ప్రకారం సవరించి, గౌడ్ లకు వైన్స్ లలో 25% కేటాయించాలన్నారు. గౌడ్ లపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో కామారెడ్డి జై గౌడ ఉద్యమం జిల్లా ప్రధాన కార్యదర్శి అంకన్న గారి శ్రీనివాస్ గౌడ్ ఇందూరు సిద్దా గౌడ్, కరోల్ల శేఖర్ గౌడ్, బొంబోతుల సురేష్ గౌడ్, తాటిపాముల ప్రశాంత్ గౌడ్, దేవేందర్ గౌడ్, భూపతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment