రైతు వ్యతిరేకి కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
ప్రశ్న ఆయుధం అక్టోబర్ 20:
రైతులకు గడిచిన వర్షకాలం రైతు బంధు డబ్బులు వేయమని నిన్న ప్రభుత్వం తరపున వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రైతులను మోసం చేస్తున్న సందర్భంగా భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పిలుపు మేరకు కామారెడ్ మాజీ శాసనసభ్యుడు గంప గోవర్ధన్,
బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అద్యక్షుడు యంకె ముజిబోద్దిన్ గార్ల అదేశాల మేరకు పట్టణ బి.ఆర్.ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తాలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. ఇట్టి దిష్టిబొమ్మ దహన కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జాకంటి ప్రభాకర్ రెడ్డి, గట్టగోని గోపిగౌడ్, కుంబాల రవియావవ్, కౌన్సిలర్లు గెరిగంటి లక్ష్మినారాయణ, నజీరోద్దీన్, కృష్ణాజిరావు, కాసర్ల స్వామి, బల్వంత్ రావు, భానుప్రసాద్, మల్లేష్ యాదవ్, సుమిత్రా ఆనంద్, రావుల గంగాధర్, దుబ్బాక ప్రసాద్, లద్దూరి కృష్ణ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
రైతు వ్యతిరేకి కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం..
by kana bai
Published On: October 20, 2024 10:16 pm