మోస్రా లో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం..
కామారెడ్డి జిల్లా మోస్రా
ప్రశ్న ఆయుధం అక్టోబర్ 21:
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మోస్రా ఆధ్వర్యంలో సొసైటీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా సొసైటీ చైర్మన్ మాట్లాడుతూ. రైతులు కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఏ గ్రేడ్ ధాన్యానికి 2320 రూపాయలు బి గ్రేడ్ రకానికి 2300 రూపాయల ధర ఉందని వివరించారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి వర్ని మండల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కే లక్ష్మణ్, విడిసి అధ్యక్షుడు సాయిలు సొసైటీ సెక్రటరీ శంకర్ , డైరెక్టర్ లు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
మోస్రా లో వడ్ల నుగోలు కేంద్రం ప్రారంభం..
by kana bai
Published On: October 22, 2024 12:20 am