ప్రజావాణి లో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి జిల్లా కలెక్టర్..

ఫిర్యాదులను
Headlines:
  1. ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంపై చర్యలు తీసుకోవాలని సూచించిన కామారెడ్డి జిల్లా కలెక్టర్
  2. ప్రజావాణిలో వచ్చిన 64 కొత్త ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా కలెక్టర్
  3. 608 పెండింగ్ ఫిర్యాదులను వెంటనే పరిష్కరించడంపై దృష్టి పెట్టిన కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

కామారెడ్డి జిల్లా ప్రతినిధి
ప్రశ్న ఆయుధం అక్టోబర్ 28 :

ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను పరిశీలించి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజావాణి లో వచ్చే అర్జీలను సంబంధిత అధికారులు పరిశీలించి చర్యలు తీసుకోవాలని సూచించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన దరఖాస్తుదారులు వారి సమస్యలపై రుణమాఫీ, భూ సమస్యలు, తదితర సమస్యలపై ఈ రోజు (64 ) అర్జీలను స్వీకరించారు. ఇందులో రెవిన్యూ 27, వ్యవసాయ శాఖ 9, పౌరసరఫరాలు 1, విద్యాశాఖ 1, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ 3, జిల్లా పంచాయతీ 10, రోడ్లు భవనాలు 1, విద్యుత్ శాఖ 1, మున్సిపల్ 7, జిల్లా గ్రామీణాభివృద్ధి 1, సర్వే ల్యాండ్ రికార్డు 2, జిల్లా సంక్షేమ అధికారి 1 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.
ప్రజావాణిలో వచ్చిన అర్జీలను పెండింగ్ లో ఉన్న వాటిని పరిశీలించి చర్యలు తీసుకోవాలని, వాటికి సమాధానాలు ఆయా అర్జీదారునికి తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. గత వారం వరకు 18,360 అర్జీలు రాగా, వాటిని పరిశీలించి 17,752 అర్జీలను ఆయా శాఖల అధికారులు పరిష్కరించారని, 608 పెండింగులో ఉన్నాయని తెలిపారు. ఈ ప్రజావాణిలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీఓ రంగనాథ్ రావు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, జడ్పీ సి.ఈ. ఒ. చందర్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రావు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now