విద్యుదాఘాతంతో గేదె మృతి

మృతి

విద్యుదాఘాతంతో గేదె మృతి – రైతు కిషన్ కు రూ. 1.20 లక్షల ఆస్తి నష్టం

ప్రశ్న ఆయుధం న్యూస్ అక్టోబర్ 30 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)

మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గూడూరు గ్రామానికిచెందిన బొట్టు కిషన్ గేదె తన పొలంలో బోరు వద్ద బుధవారం విద్యుత్తు తీగలకు తగిలి మృత్యువాత పడింది. పాడి గేదె మృతి చెందటంతో రైతు కిషన్ కు రూ. 1.20లక్షలు ఆస్తినష్టం జరిగింది. పది రోజుల కిందట రూ.1.20లక్షలకు కొనుగోలు చేసిన గేదె నిండు గర్భంతో మృతి చెంది ఉపాధి కోల్పోయిన రైతుకు ప్రభుత్వం విద్యుత్తు శాఖ ద్వారా నష్టపరిహారం అందించి ఆదుకోవాలని గ్రామస్తులు మాజీ వార్డు సభ్యుడు బోయిని నగేష్ కోరారు.

Join WhatsApp

Join Now