విద్యార్థులు హెచ్ఐవి ఎయిడ్స్ పైన అవగాహన పెంచుకోవాలి అదనపు జిల్లా కలెక్టర్..

కలెక్టర్
Headlines (Telugu)
  1. విద్యార్థులలో హెచ్ఐవి / ఎయిడ్స్ పై అవగాహన కల్పించేందుకు జిల్లా స్థాయి కార్యక్రమం
  2. అదనపు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో యూత్ ఫెస్ట్ లో హెచ్ఐవి అవగాహన కార్యక్రమం
  3. కామారెడ్డి జిల్లాలో హెచ్ఐవి / రక్తదానం పై అవగాహన పెంపు కోసం పోటీలు
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
ప్రశ్న ఆయుధం నవంబర్ 02

విద్యార్థులు హెచ్ఐవి /ఎయిడ్స్ పైన అవగాహన పెంచుకోవాలి అదనపు జిల్లా కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి
జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖలోని ,జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో యూత్ ఫెస్ట్ లో భాగంగా పాఠశాల విద్యార్థులకు, మరియు కళాశాల విద్యార్థులకు
హెచ్ఐవి/ టీబి
రక్తదానం పైన జిల్లా స్థాయి రెడ్ రన్, క్విజ్ పోటీలు డ్రామా మరియు రీల్స్” పోటీలను నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ప్రతివిభాగం నుండి మొదటి ప్రైజ్ (1000 రూపాయలు క్యాష్ ప్రైజ్,
ద్వితీయ స్థానం (750 రూపాయలు క్యాష్ ప్రైజ్, అలాగే తృతీయ స్థానం (500క్యాష్ ప్రైజ్ లు ను ఈ రోజు అదనపు జిల్లా కలెక్టర్ ఎల్.బీ. శ్రీనివాస్ రెడ్డి చేతుల మీద విద్యార్థులకు ఇవ్వడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో జిల్లా ఎయిడ్స్ ప్రోగ్రాం అధికారి డా: రాధిక డీ.పీ.ఏం.సుధాకర్ డీ.ఏ.ఏ. మహేష్ అలాగే సౌత్ క్యాంపస్ ప్రొఫెసర్ అంజయ్య గారు,విద్యార్థులు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు
ఎస్.ఆర్.కె. డిగ్రీ కళాశాల ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు టీచర్లు లెక్చరర్స్ పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now