హైదరాబాద్ రావాలంటే డ్రగ్స్‌ ముఠాలు భయపడుతున్నాయి.

IMG 20240804 WA0033

పోలీసుల వరుస దాడులతో హైదరాబాద్ రావాలంటే డ్రగ్స్‌ ముఠాలు భయపడుతున్నాయి. డ్రగ్స్ కావాలంటే బెంగళూరు వచ్చి తీసుకెళ్లాలని ఈ ముఠాలు చెబుతున్నాయి. తెలంగాణ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విచారణలో ఈ సంచలన విషయాలు వెల్లడయ్యాయి.మాదకద్రవ్యాల విక్రయాలు జరిపే సమయంలో ఈ ముఠా కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఆన్‌లైన్లో డబ్బులు చెల్లిస్తే రెండు గంటల తర్వాత డ్రగ్స్ ఎక్కడ పెట్టారో వాట్సాప్ ద్వారా లొకేషన్ షేర్ చేస్తోంది. ఎవరికి అనుమానం రాకుండా చెత్త డబ్బాల్లో రెడ్ కలర్ కవర్‌లో.. చెట్టు కింది భాగంలో బ్లూకలర్ కవర్‌లో.. రోడ్డు పక్కనే ఉన్న బండ్ల కింద పెట్టి డ్రగ్స్ విక్రయాలు చేపడుతున్నారు. మాదకద్రవ్యాలు కొనే వారికి తమ ముఖం కనిపించకుండా ముఠా సభ్యులు జాగ్రత్తలు తీసుకుంటున్నారని అధికారులు తెలిపారు. బెంగళూరులో ఉన్న కింగ్ పిన్‌ను పట్టుకోవడానికి ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు వెళ్లారు..

Join WhatsApp

Join Now