యాకుబ్ షావలి
ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా ఆర్ సి నవంబర్
ఇల్లందు, హమాలీ కార్మికుల సమావేశం ఎలేందర్ అధ్యక్షతన పాతబస్టాండ్ లోనీ అయితా కాంప్లెక్స్ కార్మికుల మస్టర్ అడ్డావద్ద ఈరోజు జరిగింది
. ఈసమావేశంలో ట్రేడ్ యూనియన్స్సెంటర్ఆఫ్ ఇండియా టి యు సి ఐ జిల్లా ఇల్లందు ఏరియా కార్యదర్శులు,షేక్ యాకుబ్ షావలి మల్లెల వెంకటేశ్వర్లు.పాల్గొని మాట్లాడుతూ
పోరాటాల పురిటిగడ్డ ఇల్లందులో ఎంతోమందివీరపుత్రులకు వీరవనితలకు పురుడుపోసింది లెక్కలేనని త్యాగాలు వీరగాధలకు చారిత్రాత్మక ఉద్యమాలకు సాక్ష్యంగా నిలబడింది.నెత్తుటితో తడిసిన మాగాణంలో ఎర్ర పూలవనం వేపుగాఎదిగింది ప్రజలకు ఈపోరాటాల ఫలితంగా అనేక విజయాలు హక్కులు సాధించబడ్డాయి ముఖ్యంగా వేలాది ఎకరాల పోడు భూమి ప్రజలుసాధించుకున్నారు. విద్యా వైద్యంగిట్టుబాటు ధరలు సాగునీరు త్రాగునీరురహదారుల సమస్య మార్కెట్ సమస్యలుఇలా అనేక సమస్యలు పరిష్కారంలో వీరుల త్యాగందాగిఉంది. ఈ విజయాలు సాధించుటకు ఎంతోమంది వీరులు వీరవనితలు తమ నెత్తురుధారపోయాల్సి వచ్చిందని* అమరవీరుల త్యాగాల స్ఫూర్తితో ప్రజాపోరాటాలను ఉదృతం చేద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు శుక్రవారం
అమరవీరుల సభఇల్లందు ఎల్లన్న భవనంలో ఉదయం 11 గంటలకుజరుగుతుందన్నారు ఈసభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో బోళ్ల సీతారాములు, బొల్లి రవి, మోటం సంపత్ బాజ్య శ్రీను,వార శ్యామ్,సందీప్,రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.