ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులపై సర్వే ఒత్తిడి తగ్గించాలి

ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులపై సర్వే ఒత్తిడి తగ్గించాలి

టీపీటీఎఫ్ కామారెడ్డి జిల్లా శాఖ

ప్రశ్న ఆయుధం న్యూస్, నవంబర్ 12, కామారెడ్డి :

ప్రాథమిక పాఠశాలలను ఒంటి గంట వరకు నిర్వహించి ఆ తర్వాత సర్వేకి వెళ్లాలని ప్రభుత్వం ఆదేశించిందని గ్రామీణ ప్రాంతాలలో క్షేత్రస్థాయిలో అది అమలు కావడం లేదని ప్రతిరోజు 10 సెలవు దినాల్లో 20 కుటుంబాల సర్వే పూర్తి చేయాలని చెబుతున్నారని ఒక్కో కుటుంబానికి 75 ప్రశ్నలు ఉండడంతో 45 నిమిషాల సమయం పడుతుందని టి పి టి ఎఫ్ జిల్లా అధ్యక్షుడు సిహెచ్ అనిల్ కుమార్, ప్రధాన కార్యదర్శి లింగంలు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కిందిస్థాయి అధికారులు ఉపాధ్యాయులపై క్రమశిక్షణ చర్యలు షోకాష్ నోటీస్ లంటూ బెదిరిస్తున్నారని, ఈ రకమైన బెదిరింపుల వలన సర్వే సక్రమంగా జరిగే అవకాశం లేదన్నారు. సర్వే చేయవలసిన కుటుంబాల సంఖ్యను ఒక్కో ఎన్యుమరేటర్ కు 100 మాత్రమే కేటాయించి ఎన్యుమరేటర్ల సంఖ్యను పెంచాలని జిల్లా కలెక్టర్ ఈ విషయంలో ప్రత్యేక చొరవ చూపాలని టి పి టి ఎఫ్ కామారెడ్డి జిల్లా శాఖ విజ్ఞప్తి చేస్తుందన్నారు. సర్వే యొక్క గడువును పొడిగించాలని ప్రభుత్వానికి టిపిటిఎఫ్ జిల్లా శాఖ విజ్ఞప్తి చేస్తుందన్నారు.

Join WhatsApp

Join Now