అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిబాపూలే వర్ధంతి 

వర్ధంతి 
Headlines 
  1. కామారెడ్డిలో మహాత్మ జ్యోతిబా పూలే వర్ధంతి ఘనంగా నిర్వహణ
  2. బహుజన హక్కుల కోసం పోరాడిన మహాత్మ పూలే సేవలు చిరస్మరణీయం
  3. గులాం గిరి పుస్తకం ద్వారా సామాజిక సమానత్వానికి పూలే పోరాటం
  4. పూలే ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి – అంబేద్కర్ సంఘం
  5. మహాత్మ పూలే 134వ వర్ధంతి – అంబేద్కర్ భావజాలానికి పూలే మిశ్రమణ

– కామారెడ్డి 

కామారెడ్డి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిబాపూలే 134 వ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద గల పూలె విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గంగారం మాట్లాడుతూ మహాత్మ జ్యోతిబా పూలే మహోన్నత వ్యక్తి అని సమాజ సమ నిర్మాణానికి అహోరాత్రులు శ్రమించిన బహుజన శ్రామిక జన బాంధవుడన్నారు. బ్రాహ్మణాధిపత్య దోపిడీ వ్యవస్థ సృష్టించిన అసమానతల కులవర్గ దోపిడీ వ్యవస్థ పై నిత్యం తిరుగుబాటు చేసిన నాయకుడనీ, గులాం గిరి అనే పుస్తకాన్ని రచించి అక్షరమే ఆయుధంగా అజ్ఞానపు బానిసత్వ సంకెళ్ళ లపై సమరభేరీ మోగించిన సామ్యవాది సామ్రాట్ అశోక చక్రవర్తి వారసత్వానికి ప్రతిబింబమైన విశ్వజ్ఞాని ఆధునిక గౌతమ బుద్ధుడు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వ్యక్తినీ గురువుగా స్వీకరించరాన్నారు. పూలే ఆశయ సాధన కై మనమంతా ఉద్యమించవలసిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో క్యాతం సీతారాములు, విట్టల్, సందీప్, సాప శివరాములు, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now