కిన్నెరసాని పర్యాటక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి జిల్లా కలెక్టర్ పరిశీలన

ప్రశ్న ఆయుధం న్యూస్ డిసెంబర్ 1 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి
పాల్వంచ కిన్నెరసాని పర్యాటక ప్రాంతాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు.
కిన్నెరసాని పర్యాటక ప్రాంతాన్ని కలియ తిరుగుతూ
మరింత అభివృద్ధి చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు.టూరిజం, ఫారెస్ట్, కేటీపీఎస్ అధికారులకు జిల్లా కలెక్టర్ పలు సూచనలు చేశారు.కిన్నెరసాని పర్యాటక ప్రాంతాన్ని సందర్శించే పర్యాటకులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు ,సౌకర్యాలు కల్పించాలి..పర్యాటకులను ఆకర్షించే విధంగా వెదురు బొంగు లతో కట్టడాలు చేయాలని కలెక్టర్ సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో టూరిజం, ఫారెస్ట్,కేటీపీఎస్ అధికారులు మరియు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now