జగన్ మోహన్ రెడ్డికి జాతీయ సాహిత్య అకాడమీ అవార్డు

ప్రశ్న ఆయుధం న్యూస్ డిసెంబర్ 1భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి
శ్రీ విద్యాభ్యాస పాఠశాల నిర్వాహకులు బండ జగన్ మోహన్ రెడ్డి కి అత్యంత ప్రతిష్టాత్మక బెస్ట్ సర్వీస్ సొసైటీ జాతీయ అవార్డు ప్రకటించిన బహుజన సాహిత్య అకాడమీ
జగన్మోహన్ రెడ్డి కి పలువురి శుభాకాంక్షలు మణుగూరు కు చెందిన శ్రీ విద్యాభ్యాస పాఠశాల నిర్వహకులు బండ జగన్మోహన్ రెడ్డి కి బహుజన సాహిత్య అకాడమీ (బి ఎస్ ఏ) వారు అత్యంత ప్రతిష్టాత్మక బెస్ట్ సర్వీస్ సొసైటీ జాతీయ అవార్డును ప్రకటించారు.ఈ మేరకు ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లోని నాచారంలో గల బహుజన సాహిత్య అకాడమీ కార్యాలయంలో బి ఎస్ ఏ జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ ఈ అవార్డును సభికుల హర్షద్వానాల మధ్య ప్రకటిస్తూ ఆహ్వాన పత్రాన్ని జగన్మోహన్ రెడ్డికి అందజేశారు. రెడ్డి ని ఈ సందర్భంగా అభినందించారు ఈ సందర్భంగా నల్లా రాధాకృష్ణ మాట్లాడుతూ ఎస్ సి, ఎస్ టీ, బీసీ మరియు మైనార్టీల సాహిత్యాన్ని ముందుకు తీసుకుపోవటం కోసం బహుజన సాహిత్య అకాడమీ వారు ప్రతి ఏటా ప్రజా ఉద్యమకారులకు, సంఘ సేవకులకు, సామాజిక కార్యకర్తలకు , రచయితలకు, కవులకు మరియు స్వచ్ఛంద సంస్థలకు ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ అవార్డులను అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా డిసెంబర్ 15వ తేదీ దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగే బహుజన సాహిత్య అకాడమీ ఐదవ నేషనల్ కాన్ఫరెన్స్ సందర్భంగా బెస్ట్ సర్వీస్ సొసైటీ జాతీయ అవార్డును రెడ్డి కి అందజేయునట్లు ఆయన తెలిపారు. ఈ ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ కు దేశవ్యాప్తంగా ఇరవై ఏడు రాష్ట్రాల నుండి సుమారు వెయ్యి మంది ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరవుతాని రాధాకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ బహుజన సాహిత్య అకాడమీ వారు తన సేవలను గుర్తించి ప్రత్యేకించి మణుగూరు సమీప గ్రామాలలోని వలస గొత్తి కోయల విద్యార్థులను, నిరుపేద గిరిజన గిరిజనేతరుల ,విద్యార్థిని విద్యార్థులను, బాల కార్మికులను చేరదీసి వారికి వసతి సౌకర్యంతో పాటు విద్యాబుద్ధులు నేర్పించి ప్రభుత్వ ప్రవేశ పరీక్షల ద్వారా ఉత్తీర్ణులైన విద్యార్థినీ విద్యార్థులను గురుకుల పాఠశాలలో చేర్పించి వారి ఉన్నతికి పాటుపడుతున్న తన నిస్వార్ధ సేవలను గుర్తించి అత్యంత ప్రతిష్టాత్మక బెస్ట్ సర్వీస్ సొసైటీ జాతీయ అవార్డును ప్రకటించిన పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ జాతీయ అవార్డు తనలో ఆత్మస్థైర్యాన్ని, బాధ్యతలను మరింత పెంచిందని ఈ ప్రోత్సాహంతో చదువుకు దూరమైన మరి ఎంతోమంది పేద విద్యార్థులకు మరింత చేరువయ్యే విధంగా తన సేవలను మరింత విస్తృతపరిచే విధంగా వారి ఉన్నతికి శ్రీ విద్యాభ్యాస బృందం మరింత కృషి చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. అవార్డును తన అమ్మానాన్నలకు అంకితం ఇస్తున్నట్లుగా జగన్మోహన్ రెడ్డి విలేకరులకు తెలిపారు. శ్రీ విద్యాభ్యాస పాఠశాల నిర్వాహకులు జగన్మోహన్ రెడ్డి గారికి బెస్ట్ సర్వీస్ సొసైటీ జాతీయ అవార్డు ప్రకటించడం పట్ల గోదావరిలోయ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి, సింగరేణి సేవా సమితి సభ్యులు, సామాజిక కార్యకర్త సేవా రత్న జాతీయ అవార్డు గ్రహీత ఎస్ డి నా సర్ పాషా మాట్లాడుతూ ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఏజెన్సీ ప్రాంత వలస గొత్తి కోయల గిరిజనుల, నిరుపేదల బాల కార్మికుల జీవితాల్లో అక్షర జ్యోతిని వెలిగించేందుకు కృషి చేస్తున్న రెడ్డి సేవలు ప్రశంసనీయమని ఆయన కొనియాడారు సామాజిక సేవ కొరకు నిస్వార్ధంగా సేవలందిస్తున్న జగన్మోహన్ రెడ్డి సేవలను బహుజన సాహిత్య అకాడమీ వారు గుర్తించి ప్రతిష్టాత్మక జాతీయ అవార్డు ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రెడ్డి కి చరవాణిలో శుభాకాంక్షలు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి కి ఈ అవార్డుకు సంబంధించి ఆహ్వాన పత్రం అందజేసిన వారిలో బీఎస్ఏ జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ తో పాటు తెలంగాణ విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఎం ఎం గౌతమ్, రాష్ట్ర కోఆర్డినేటర్ హనుమాండ్ల విష్ణు మరియు అవార్డు సెలక్షన్ కమిటీ సభ్యులు రాష్ట్ర కార్యదర్శి నల్లా జ్యోతి, కోయిల తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now