ప్రశ్న ఆయుధం న్యూస్ డిసెంబర్ 6 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి
రాజ్యాంగ రచయిత డాక్టర్ అంబేద్కర్ 68వ వర్ధంతి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు.
భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని ఎమ్మెల్యే కూనంనేని వెల్లడించారు.
సామాజిక న్యాయం కోసం సమసమాజ స్థాపన కోసం తన జీవితాన్ని అంకితం చేసి,కుల రహిత సమాజం కోసం త్యాగాలు చేసిన మహానుభావుడు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని, వారు రచించిన రాజ్యాంగం ద్వారానే మన భారతదేశం సమైక్యతతో సమగ్రతతో అభివృద్ధి పథంలోకి నడుస్తున్నదని కొని ఆడారు. కొంతమంది కుహనావాదులు, భారత రాజ్యాంగంలోని, సెక్యులరిజం లాంటి పదాలను తొలగించాలని కుట్ర పన్నుతున్నారని, దానిని ప్రతి భారత పౌరుడు తిప్పికొట్టాలని,
అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని, భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉన్నదని సాంబశివరావు ఉద్ఘాటించారు
భారత రాజ్యాంగ సృష్టికర్త బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా భారతరత్ అంబెడ్కర్ సంక్షేమ సంఘం మరియు జిల్లా మాల మహానాడు ఆధ్వర్యంలో పోస్ట్ ఆఫీస్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ మాట్లాడుతూ, బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ద్వారానే భారతదేశానికి దశ దిశ నిర్దేశకత్వం జరుగుతున్నదని, విభిన్న జాతులు విభిన్న మతాలు విభిన్న కులాలు విభిన్న సంప్రదాయాలు భారతదేశ సమైక్యంగా సౌబ్రాతృత్వంతో సోదర భావంతో జీవిస్తున్నారంటే కేవలం భారతరత్న అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం వల్లనే సాధ్యపడుతున్నదని, భారత రాజ్యాంగంలో పొందుపరిచిన నాలుగు స్తంభాలైనటువంటి సమానత్వం, సౌబ్రాతృత్వం, స్వేచ్ఛ , న్యాయము అనే అంశాలు అన్ని వర్గాల ప్రజలకు సమానంగా అంది, పేద గొప్ప తారతమ్యం లేకుండా ప్రజలందరూ సమానంగా సమాన స్వాతంత్రాన్ని సమాన ఫలాలను అనుభవించినప్పుడే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నిజమైన నివాళి అని పిలుపునిచ్చారుఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, రెవెన్యూ డివిజనల్ అధికారి మధు,
మున్సిపల్ కమిషనర్ శేషాంజన్ స్వామి,
సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా, సిపిఐ పార్టీ నాయకులు కంచర్ల జమలయ్య, మాల మహానాడు జిల్లా అధ్యక్షులు పూల రవీందర్,మాల మహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి కొప్పరి నవతన్, మాల మహానాడు గౌరవ అధ్యక్షులు పీక కృష్ణ స్వామి, నాయకులు శ్రీకాంత్, గౌతమ్
జిల్లా మహిళా అధ్యక్షురాలు బడికల పుష్పలత, ప్రధాన కార్యదర్శి కల్పన, నాయకురాలు లావణ్య శంకర్ తదితరులు పాల్గొన్నారు.
అంబేద్కర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి
by Naddi Sai
Published On: December 6, 2024 8:44 pm
