ఆటో కార్మికులను తెలంగాణ ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలి

ప్రభుత్వం
Headlines :
  1. “ఆటో కార్మికులకు ఆర్థిక సహాయం అందించాలి: తెలంగాణ ప్రభుత్వంపై డిమాండ్”
  2. “ఆటో యూనియన్ నిరసన: మహాలక్ష్మి పథకం కారణంగా ఆటో కార్మికుల జీవనోపాధి దెబ్బతినడం”
  3. “జమ్మికుంటలో ఆటో కార్మికుల బంద్, తెలంగాణ ప్రభుత్వానికి నిరసన”
  4. “ఆటో కార్మికులకు 12,000 రూపాయల ఆర్థిక సాయం మంజూరు చేయాలని డిమాండ్”
  5. “ఆటో యూనియన్ నాయకులు: న్యాయం పొందే వరకు నిరసనలు కొనసాగిస్తాం”

*జమ్మికుంట డిసెంబర్ 7 ప్రశ్న ఆయుధం*

ఆర్థికంగా చితికి పోతున్న ఆటో కార్మికులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక చేయూత అందించి ఆదుకోవాలని ఆటో యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఆటోల బందుకు యూనియన్ సంఘాలు పిలుపు నిచ్చిన నేపథ్యంలో శనివారం జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని స్థానిక బస్టాండ్ ఏరియా, కొత్తపల్లి మడిపల్లి చౌరస్తాలో ఆటోలను బందు చేస్తూ నిరసనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టి నేటితో సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఆటో కార్మికులు జీవనోపాధి తీవ్రంగా దెబ్బతిన్నదని, ఈ పథకం వలన ఆటో కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మహాలక్ష్మి పథకం ప్రవేశ పెట్టడం వలన నాలుగు లక్షల ఆటో కార్మికులము రోడ్డున పడ్డామని అన్నారు. ఆటో డ్రైవర్ల జీవనోపాధిని కాపాడాలని డిసెంబర్ 7వ రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలను బందు చేసి తెలంగాణ ప్రభుత్వానికి తమ నిరసనలు వ్యక్తం చేశామన్నారు. ఇన్సూరెన్స్ ఫిట్నెస్ పెండింగ్ చాలాన్లు రద్దుచేసి తమకు న్యాయం చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన ప్రకారం 12,000 రూపాయల ఆర్థిక సాయం తక్షణమే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట టౌన్ ప్రెసిడెంట్ మారపల్లి శ్రీనివాస్, హుజురాబాద్ నుండి జమ్మికుంట రూటు టౌన్ ప్రెసిడెంట్ గుడ్ల కిట్టయ్య, కొత్తపల్లి ఆటో యూనియన్ ప్రెసిడెంట్ మంథిని శ్రీహరి, వైస్ ప్రెసిడెంట్ ధరుగుల కుమార్, క్యాషియర్ నేరెళ్ల రంజిత్, డ్రైవర్లు ఎండి హబీబ్ , కే శ్రీనాథ్, బి మల్లేష్ ఎం సుక్కయ్య, కే,ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now