Headlines
-
ఖమ్మంలో ఘనంగా సోనియా గాంధీ 78వ జన్మదినోత్సవం
-
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన సోనియా గాంధీని గౌరవించిన కాంగ్రెస్ శ్రేణులు
-
ఖమ్మం: సోనియా గాంధీ జన్మదిన వేడుకల్లో కాంగ్రెస్ నాయకుల శుభాకాంక్షలు
-
తెలంగాణకు ప్రత్యేక అభిమానంతో సోనియా గాంధీ 78 వసంతాలు పూర్తి
-
ఖమ్మంలో సోనియా గాంధీ జన్మదినం: కాంగ్రెస్ నేతలు మన్నన
* కేక్ కట్ చేసిన కాంగ్రెస్ శ్రేణులు
* తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కలను సాకారం చేసిన తల్లి అంటూ.. నేతల శుభాకాంక్షలు
*ఖమ్మం:* కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ 78వ జన్మదినోత్సవాన్ని ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి క్యాంపు కార్యాలయంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేకును.. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, రాష్ట్ర నాయకురాలు మద్దినేని స్వర్ణకుమారి, జిల్లా నాయకులు కొప్పుల చంద్రశేఖర్ కట్ చేశారు. అనంతరం పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ..60 ఏళ్ల పోరాటాన్ని గౌరవించి.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సోనియమ్మ ఏర్పాటు చేశారని తెలిపారు. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా తల్లి పాత్ర పోషించారని గుర్తు చేశారు. అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడూ సోనియమ్మకు తెలంగాణ అంటే ప్రత్యేక అభిమానమని, అంతకుమించిన అనుబంధమని అన్నారు. ఆవిడ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ పార్టీ నాయకులు, శ్రేణులంతా శుభాకాంక్షలు తెలిపారు.
*ఈ కార్యక్రమంలో..:* కాంగ్రెస్ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, నాయకులు మిక్కిలినేని నరేందర్, మందడపు మనోహర్, తాళ్లూరి రాము, స్ఫూర్తి ఓం రాధాకృష్ణ, ఉమ్మినేని కృష్ణ, లింగాల రవికుమార్, ఎయిర్టెల్ నరసింహారావు, మక్కా శేఖర్ గౌడ్, బోడ శ్రావణ్, భానోత్ ఉత్తేజ్ నాయక్, సురేష్ నాయక్, సైదులు, గురుమూర్తి, మాజీద్, అంజనీ కుమార్, బచ్చలకూరి నాగరాజు, పార్వతి రెడ్డి, శ్రీకళా రెడ్డి, హారిక నాయుడు, జిల్లా సాంస్కృతిక విభాగ కళాకారులు, తదితరులు పాల్గొన్నారు.