– ఇదేనా ప్రజా పాలన…?

ప్రజా
Headlines
  1. సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరసన: రెగ్యులర్ డిమాండ్ కోసం ఆందోళన
  2. అమరవీరులకు నివాళి: సమగ్ర శిక్ష ఉద్యోగుల ర్యాలీ
  3. పే స్కేల్ అమలు చేయండి: ఉద్యోగుల గర్జన
  4. ప్రభుత్వం స్పందించకుంటే సమ్మె: సమగ్ర శిక్ష ఉద్యోగుల హెచ్చరిక
  5. తీర్పు కోసం ఎదురుచూపులు: డిసెంబర్ 10 నుంచి నిరవధిక సమ్మె
ప్రభుత్వాలు మారినా పట్టించుకోరా.?

– వెట్టి చాకిరికి విముక్తి ఎప్పుడు

– ఇదేనా ప్రజా పాలన

ప్రశ్న ఆయుధం 9డిసెంబర్ కామారెడ్డి

సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరసన కార్యక్రమంలో భాగంగా మూడవరోజు సమగ్ర శిక్ష ఉద్యోగులు ర్యాలీగా వెళ్లి న్యూ బస్టాండ్ వద్ద మానవహారం చేసి తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించరు. డిసెంబర్ 9 ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు ప్రకటన రోజు అమరవీరుల త్యాగాలకు ఫలితంగా తెలంగాణ రాష్ట్రం వస్తే కాంట్రాక్టు ఉద్యోగుల సైతం ఉద్యమంలో పాల్గొనడం జరిగిందన్నారు. కానీ తమ బతుకులు మారలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రధానమైన డిమాండ్ కాంటాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అప్పటివరకు వెంటనే పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.

సమస్యలు పరిష్కారం కాకుంటే నిరవధిక సమ్మెకు వెళ్తున్నట్టు అడిషనల్ కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారులకు సమ్మె నోటీస్ అందజేశారు. ఇప్పటికీ విద్యావ్యవస్థలో చాలా రకాలైన పనులు ఆగిపోయని, కేజీబీవీ పాఠశాలలో విద్యార్థులకు బోధన చేయడం లేదని ఉద్యోగులు తెలిపారు.

డిసెంబర్ 9 సోనియాగాంధీ పుట్టినరోజు సందర్భంగా సీఎం  ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటారని రేపటి వరకు తీపి కబురు అందుతుందని ఉద్యోగులు ఆశిస్తున్నారు. తమ సమస్యల పట్ల ప్రభుత్వం స్పందించకుంటే డిసెంబర్ పది నుంచి రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర శిక్షలు పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు 19600మంది నిరవధిక సమ్మెకు వెళ్తున్నట్టు తెలిపారు. సమ్మెకు వెళ్తే విద్యాశాఖలో కీలకంగా పనిచేస్తున్న ఉద్యోగులు బోధన,బోధనేతర పనులు నిలిపివేసి విద్యావ్యవస్థను స్తంభింప చేస్తామని హెచ్చరించారు. అందుకు టీచర్స్ యూనియన్ సంఘాలన్నీ కూడా తమకు మద్దతు ఇచ్చారనే విషయాన్ని ఈ సందర్భంగా ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి పిఆర్టియు తెలంగాణ జిల్లా అధ్యక్షులు అంబీర్ మనోహర్ హాజరై ఉద్యోగులకు సంఘీభావం తెలుపుతూ వారి సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు మద్దతుగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి సంపత్తు, మహిళా అధ్యక్షురాలు వాసంతి, కోశాధికారి భాను, నాయకులు రోబో శీను, శ్రీధర్ కుమార్, రాములు, యోగేశ్వర్, సంతోష్ రెడ్డి,శ్రీనివాస్, వనజ, శైలజ, భీమన్నా,మాధవి,కాళిదాస్, కృష్ణ,గంగ ప్రసాద్, బన్సీలాల్,లింగం, దినేష్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now