ప్రజావాణి లో వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించాలి

దరఖాస్తును
Headlines
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రజావాణి కార్యక్రమం: ప్రజల సమస్యలపై చర్యలు
  • అదనపు కలెక్టర్ వేణుగోపాల్ ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నారు
  • తెలంగాణ ప్రభుత్వ అధికారులపై కొత్త ఆదేశాలు: సమస్యలు పరిష్కరించండి
  • వైద్య సేవలు, భూమి సమస్యలు, మీ సేవ కేంద్రాల సమస్యలు: అడ్రస్ చేసిన అదనపు కలెక్టర్

అదనపు కలెక్టర్ వేణుగోపాల్
ప్రశ్న ఆయుధం న్యూస్ డిసెంబర్ 9 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి
ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు.ఈ సందర్భంగా దరఖాస్తు చేసిన అభ్యర్థులను వివరాలను అడిగి తెలుసుకొని సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని శాఖల వారీగా అధికారులను అతను కలెక్టర్ వేణుగోపాల్ ఆదేశించారు.
చండ్రుగొండ మండలం రావికంపాడు గ్రామంలో (ఆర్ వి ఎం ) 2011-12 నిధులు క్రింద రావికంపాడు గ్రామ ప్రాథమిక ఉన్నత పాఠశాల యందు అదనపు గదులు నిర్మాణం పూర్తి అయిన నేటి వరకు బిల్లులు జమకాలేదని కాంట్రాక్టర్ భూపతి శ్రీనివాసరావు చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యలు నిమిత్తం పిఓ ఐటీడీఏకు ఎండార్స్ చేయడం జరిగింది.సుజాతనగర్ మండలం వేపలగడ్డ గ్రామంలో నివాసం ఉంటున్న బానోతు విజయ కుమారి భర్త బిక్కులాల్ వేపల గడ్డ గ్రామంలోని సర్వే నెంబర్ 446 లో 16 గుంటలు మరియు 447 లో 22 గుంటల భూమి వారసత్వంగా తమకు వచ్చిందని,అట్టి భూమికి పట్టా మంజూరు చేయాలని చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యల నిమిత్తం ఈ సెక్షన్ సూపర్డెంట్ కు ఎండార్స్ చేశారు.
పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని పాత పాల్వంచలో నివాసం ఉంటున్న లీలావతి భర్త వెంకటేశ్వర్లు గేదెల పెంపకం చేసుకుంటూ జీవనోపాధి కోసం పాల వ్యాపారం చేసుకుంటున్నామని,గేదెల పెంపకం కోసం కాళీ ఫ్లాట్లో అద్దె చెల్లించి, ఫెన్సింగ్ మరియు షెడ్డు నిర్మించి శుభ్రత పాటిస్తూ పెంపకం చేపడుతున్నామని కానీ ఎదురుగా నివాసముంటున్న వారు ఉద్దేశపూర్వకంగా తమపై పాల్వంచ మున్సిపాలిటీలో ఫిర్యాదు చేశారని దానికి పాల్వంచ మున్సిపల్ అధికారులు వచ్చి షెడ్ తొలగించవలసిందిగా ఆదేశాలు చేసినందుకు మా జీవనోపాధి కోల్పోకుండా తగిన చర్యలు తీసుకోవాలని చేసిన దరఖాస్తును తగు చర్యల నిమిత్తం పాల్వంచ మున్సిపల్ కమిషనర్ కు ఎండార్స్ చేయడం జరిగింది.పాల్వంచ మండలం,కొత్త సూరారం గ్రామంలో నివాసం ఉంటున్న భూక్య కళ్యాణ్ తండ్రి నాను సూరారం, పాండురంగపురం రెవెన్యూ గ్రామపంచాయతీ పరిధిలో మీసేవ కేంద్రాలు అందుబాటులో లేకపోవడం వలన, ఈ రెవెన్యూ గ్రామపంచాయతీలు పాల్వంచ మండల కేంద్రానికి దూరంగా ఉండటం వలన ఇక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని,నూతన మీ సేవ కేంద్రం మంజూరు చేసినచో ఈ రెవెన్యూ గ్రామపంచాయతీల ప్రజలకు ఉపయోగంగా ఉంటుందని చేసిన దరఖాస్తులు పరిశీలించి తగు చర్యలు నిమిత్తం ఈడీఎం కు ఎండార్స్ చేశారు.
ఇల్లందు మండలం మామిడి గుండాల గ్రామంలో నివాసం ఉంటున్న ముక్తి కొమరయ్య సన్నాఫ్ లక్ష్మీ నర్సు నెల వయసు గల తన కుమారుడికి ఆరోగ్యం బాగోలేక అర్ధరాత్రి రోళ్లగడ్డ గ్రామం నుండి ఈ ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ నైట్ డ్యూటీ డాక్టర్స్ అందుబాటులో లేక విధులు నిర్వహిస్తున్న సిబ్బంది కనీసం చూడకుండానే బయటకు పంపించారు. మాకు వాహనం లేదు బస్సులు నడిచే వరకు ఇక్కడే ఉంటాము అన్నా కానీ వినిపించుకోకుండా బయటకు పంపించారని, కావున నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బంది పై కఠిన చర్యలు తీసుకోవాలని చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యలు నిమిత్తం జిల్లా వైద్య శాఖ అధికారికి ఎండార్స్ చేశారు.
ఈ ప్రజావాణి కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now