ఈరోజు దమ్మపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ముగ్గురు వ్యక్తులను ది 09.12.2024 మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో గంజాయి సేవిస్తుండగా పట్టుకొని రిమాండ్కు తరలించడం జరిగింది. ఎర్ర గుంపుకు చెందిన తాటి సాయి కృష్ణ మరియు బయట ఆనంద్ అలాగే చెల్లగొంపుకు చెందిన కుంజా కిషోర్లు ముగ్గురు గంజాయి సేవించడానికి డొంకరాయి వెళ్లి అక్కడ గంజాయి కొనుక్కొని వచ్చి పార్కాల గండి గ్రామ శివారులో గల మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ వద్ద గంజాయి సేవిస్తుండగా వారిని పట్టుకుని ఈరోజు రిమాండ్ కు తరలించడం జరిగింది. వారి దగ్గర దొరికిన గంజాయి 800 గ్రాములు విలువ 24 వేల రూపాయల గా ఉంది. ఈ యొక్క కేసులో గల ముద్దాయిలను అశ్వరావుపేట సిఐ టీ. కరుణాకర్ రిమాండ్ చేయడం జరిగింది. ఈ యొక్క గంజాయి కేసులో ఇంకా 6 గురు వ్యక్తులు అరెస్టు చేయవలసి ఉన్నది. ఈ కేసు దర్యాప్తు లో పాల్గొన్నారు టీ కరుణాకర్, సీఐ అశ్వరావుపేట, బి సాయి కిషోర్ రెడ్డి, ఎస్సై దమ్మపేట, , కానిస్టేబుల్ లక్ష్మణ్,వీర పాల్గొనడం జరిగింది.
Latest News
