థర్డ్ డిగ్రీ ప్రయోగించిన అధికారిని పూర్తిగా విధులనుండి పూర్తిగా తొలగించాలి. 

దళిత మహిళ పై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన అధికారిని పూర్తిగా విధులనుండి పూర్తిగా తొలగించాలి. 

 

IMG 20240810 WA0007

దళిత మహిళా సునీత పై జరిగిన దాడికి నిరసనగా బహుజన్ సమాజ్ పార్టీ రంగా రెడ్డి జిల్లా కమిటీ అధ్యక్షులు పానుగంటి ప్రవీణ్ కుమార్ అధ్వర్యంలో ఎల్బీనగర్ లో నిరసన ర్యాలీ మరియు ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్ మాట్లాడుతూ షాదనగర్ పట్టణంలో అట్టడుగు వర్గంగా ఉన్న ఒక దళిత సామాజిక వర్గపు మహిళా సునీత పై దాడి అమానవీయం అని వివస్త్రను చేసి భర్త మరియు కొడుకు ఎదుట థర్డ్ డిగ్రీ ప్రయోగించిన డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామిరెడ్డిని వెంటనే విధుల నుండి శాశ్వతంగా తొలగించాలని డిమాండ్ చేశారు. ఇంత దారుణం జరిగిన ప్రభుత్వం స్పందించకపోవడం అధికారి పై చర్యలు తీసుకోకపోవడం ఇది కుల, దొర దురాహంకారి నిదర్శనం అని బాధ వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇబ్రహాం శేఖర్ మాట్లాడుతూ 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఒక దళిత మహిళ పై పోలీస్ లాకప్ లో దాడి అనేది నిరంకుశ కుల వాదానికి నిదర్శనం అని కొనియాడారు. అగ్రవర్ణాల స్త్రీల పై దాడి జరిగితే ప్రభుత్వం అధికారులు ఇదే విధంగా స్పందిస్తారా?? ప్రజాసంఘాలు ( ఎస్సీ ఎస్టీ ) ప్రజా ప్రతినిథులు ఇప్పటికీ నోరు విప్పక పోవడం సిగ్గు చేటు. ఈ సంఘటన పై కనీసం ఉప ముఖ్యమంత్రి , స్పీకర్ స్పందించక పోవడం హేయమైన చర్య అని కొనియాడారు.ఈ విషయం సరైన న్యాయం చేయకపోతే వెంటనే డీజీపీ మరియు దళిత ఎమ్మెల్య ఆఫీస్ మరియు కార్యలయలు ముట్టడి చేస్తాం అని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడ్వొకేట్ నిషాని రామచంద్రం, గుండెల ధర్మేందర్, రాష్ట్ర కార్యదర్శులు గ్యార జగన్ , దయాకరన్ మౌర్య , జిల్లా నాయకులు పల్లాటి రాములు, మాసూరి నాగరాజు,కంబాల పల్లి శాంత గారు వివిధ అసెంబ్లీ అధ్యక్షులు సాయిరామ కృష్ణ ముదిరాజ్, గ్యార మల్లేష్, దొడ్డి శ్రీనివాస్ తదితరులు

Join WhatsApp

Join Now