మంత్రి మల్లారెడ్డి యూనివర్సిటీలో ఉద్రిక‌త్త‌: ఫ‌ర్నీచ‌ర్ ధ్వంసం

IMG 20240810 WA0057

బీఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన మల్లారెడ్డి అగ్రికల్చర్ యూని వర్సిటీలోశనివారం ఉద్రిక్తత నెలకొంది. రెండు రోజుల కింద‌ట ఒక విద్యార్థి అనుమానాస్ప‌ద స్థితిలో మృతి చెందిన విష‌యం తెలిసిందే. దీనిపై విద్యార్థి సంఘాలు ఆందోళ‌ న‌కు దిగాయి. ఎన్ఎస్ యూఐ, ఏబీవీపీ, విద్యార్థి సంఘాలు కాలేజీలోకి ప్రవేశించి నిరసనలు తెలిపారు. విద్యార్థి మరణంపై కాలేజీ యాజమాన్యం స్పందించా లని డిమాండ్ చేశారు. యూనివర్సిటీ ఫర్నీచర్, అద్దాలు ధ్వంసం చేశారు. త‌ర‌గ‌తులు బ‌హిష్క‌రించిన విద్యార్థులు విద్యార్థులు త‌ర‌గ‌తుల‌ను బ‌హిష్క‌రించి మైదానంలో బైఠాయిం చారు. విద్యార్థి తల్లిదండ్రులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కాలేజీ వద్దకు చేరుకున్న పేట్ బాషీరాబాద్ పోలీసులు విద్యార్థి సంఘ నేతలను మందలించే ప్రయత్నం చేశారు. ఘటనపై పోలీసులు వివ‌రాలు సేక‌రిస్తున్నారు.

Join WhatsApp

Join Now