కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటా.
కార్యకర్తలకు అండగా ఉంటా: పార్టీ మారే ప్రసక్తి లేదు.
ఊపిరి ఉన్నంత వరకు ప్రజా సేవకై పాటుపడుతా.
ప్రజా సమస్యలపై ప్రతిపక్షమై గళం ఎత్తాలి…
కొడకండ్ల మండల కేంద్రంలోని బీఆర్ఎస్ మండల పార్టీ కార్యాలయం లో ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య అతిధిగా రాష్ట్ర మాజీ మంత్రి, బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు.*ఈ సమావేశం లో ఆయన మాట్లాడుతూ… సాధ్యం కానీ హామీలతో గారడి చేసి గద్దెకింది కాంగ్రెస్ ప్రభుత్వం.6 గ్యారంటీలతో ఒక ఫెయిల్యూర్ ప్రభుత్వంగా మిగిలిపోతుంది.ఈ మోసపూరిత హామీలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేందుకు ప్రతి గ్రామం నుండి ఒక బలమైన కార్యకర్తలను తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది.ప్రతి ఒక్క కార్యకర్త కలసికట్టుగా పనిచేసి పార్టీకి పూర్వ వైభవం తెచ్చేలా కష్టపడాల్సిన అవసరం ఉంది.సోషల్ మీడియాలో నాపై వస్తున్నటువంటి పార్టీ మార్పుపై పుకార్లను మీరెవరు నమ్మకండి.రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి అన్ని విధాలు అండగా ఉంటా, గెలిపించుకుంటా.ష్పడే ప్రతి కార్యకర్తని కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత నాది.త్వరలోనే గ్రామ గ్రామాన రివ్యూ మీటింగ్ లు పెట్టి కష్టపడే ప్రతి కార్యకర్తకి తగిన గుర్తింపు ఇస్తూ పార్టీ బలోపేతానికి భవిష్యత్ ప్రణాళికలను రూపొందించుకుందాం.సోషల్ మీడియా పరంగా ప్రతి ఒక్కరూ ముందు ఉండాలి. సోషల్ మీడియ ధ్వారా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి మోసపూరిత హామీలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్తూ ఉండాలి అని దిశా నిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో కొడకండ్ల భారత రాష్ట్ర సమితి నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు పార్టీ ముఖ్య నాయకులు అభిమానులు యువజన & సోషల్ మీడియా, మహిళ నాయకులు తదితరులు పాల్గొన్నారు