కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల మౌలిక సమస్యలు తక్షణమే పరిష్కరించాలి

జనవరి: 03-01-2025 (ప్రశ్న ఆయుధం)ములకలపల్లి :

అఖిల భారత ఐక్య రైతు సంఘం (ఏఐయుకెఎస్) ములకలపల్లి మండల కమిటీ డిమాండ్ :

 

అఖిల భారత ఐక్య రైతు సంఘం (ఏఐయుకెఎస్) రాష్ట్ర కమిటీ ముద్రించిన పోస్టర్లు ములకలపల్లి మండల కేంద్రంలో ఆవిష్కరించటం జరిగింది. ఈ సందర్బంగా, అఖిల భారత ఐక్య రైతు సంఘం (ఏఐయుకెఎస్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి కల్లూరి కిషోర్, సిపిఐ (ఎంఎల్)మాస్ లైన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు నూపా భాస్కర్ లు మాట్లాడుతూ,

ప్రజలు రైతులు కూలీలు సామాన్య ఎదుర్కొంటున్న డిమాండ్లను ప్రచారంలోకి తీసుకు రావడం కోసం అఖిలభారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో జనవరి 9న నిర్వహిస్తున్న ఆల్ ఇండియా డిమాండ్ డే ని వివిధ వర్గాల ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని ఐక్య రైతు సంఘం జిల్లా కార్యదర్శి కల్లూరి కిషోర్ , మాస్ లైన్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు నూపా భాస్కర్ లు కోరారు.”విత్తనాల నుండి మార్కెట్ వరకు, రైతులకు భారత ప్రభుత్వం అంకితభావంతో కృషి చేస్తుందని, 23 డిసెంబర్ 2024న భారత ప్రభుత్వం తరపున వివిధ జాతీయ వార్తా పత్రికల్లో మొదటి ‘పేజీ ప్రకటనల ద్వారా మోడీ ప్రభుత్వం ఊదరగొట్టిందని , వ్యవసాయ మంత్రిత్వ శాఖ తన బడ్జెట్ కేటాయింపులను 2014-15 నుండి 2024-2025 వరకు ఐదు ఇంతలు పెంచినట్లుగా, ఫలితంగా రైతులు సంపన్నులయ్యారని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని, వాస్తవ పరిస్థితి దానికి విరుద్ధంగా ఉందని వారు అన్నారు.అదే విధంగా వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్దతు ధర (MSP) ఐదు రెట్లు పెంచారా? అని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.రైతుల జీవిత అనుభవాలు వ్యవసాయ కూలీలు, అసంఘటిత, ఐసీడీఎస్, మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాలు ఐదు రెట్లు పెరిగాయా? అని ఆయన ప్రశ్నించారు.2014నుండి వ్యవసాయ కూలీల వాస్తవ వేతనాలు ప్రతి సంవత్సరం 113 శాతం తగ్గాయని భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ గణాంకాలు తెలియజేస్తున్నాయని కిషోర్, భాస్కర్ లు తెలిపారు.మోడీ పాలనలో “ఐదు రెట్లు పెంచండి” అని జుమ్లా ప్రచారం చేస్తున్నప్పటికీ, వాస్తవానికి గత పదేళ్లలో నాలుగు ఫ్లాగ్ షిప్ పథకాల్లో బడ్జెట్ కేటాయింపులు ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS), ఎస్ఆర్ఆజిఎ, ఐసిడిఎస్ మరియు మిడ్ డే మీల్స్ మోడీ పాలనలో నిర్వీర్యమయ్యాయని విమర్శించారు.సాగు భూములకు రైతు భరోసా ఒకేసారి ఇవ్వాలని,రైతు రుణమాఫీ సమగ్రంగా అమలు చేయాలని,MSP చట్టబద్దం చేయాలని, సమగ్ర ఖర్చుల మీద 50% అదనంగా కలిపి (C2+50%) MSP నిర్ణయించాలని,NEGRAలో 200 రోజుల పని, రోజుకు 600 రూపాయల వేతనం ఇవ్వాలని,వ్యవసాయ కూలీలు, చిన్న సన్నకారు, మధ్య తరహా రైతుల రుణమాఫీ చేయాలని,అటవీ హక్కుల చట్టం 2006 సమగ్రంగా అమలు చేయాలని,పోడు భూములకు పట్టాలివ్వాలని,భూమి లేనివారికి భూమి, ఆకలితో ఉన్నవారికి ఆహారం, ఇల్లు లేనివారికి ఇల్లు మరియు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని తదితర డిమాండ్లను పరిష్కరించాలనిAIUKS దేశవ్యాప్త రైతాంగ ఉద్యమాన్ని చేపట్టిందని, ఉద్యమంలో ప్రజల అధిక సంఖ్యలో పాల్గొనాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఐక్య రైతు సంఘం పాల్వంచ డివిజన్ కార్యదర్శి నకిరికంటి నాగేశ్వర్రావు, మండల కార్యదర్శి ఎర్రగొర్ల రామారావు తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now