శాసన మండలి ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్

ఫిబ్రవరి 3 నుంచి ఫిబ్రవరి 10 వరకు నామినేషన్ల స్వీకరణ
ఎమ్మెల్సీ ఎన్నికల పై జిల్లా కలెక్టర్ లతో వీడియో సమావేశం ద్వారా సమీక్షించిన సీఈఓ
ప్రశ్న ఆయుధం న్యూస్ ఫిబ్రవరి 1 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి
శాసనమండలి సభ్యుల ఎన్నికలు సజావుగా జరిగేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు.శనివారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల పై భద్రాద్రి కొత్తగూడెం అదనపు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ తో వీడియో సమావేశం ద్వారా సమీక్షించారు.ఐ డి ఓ సి కార్యాలయం నుంచి అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ ఈ వీడియో సమావేశంలో పాల్గొన్నారు.వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి కరీంనగర్ , నిజామాబాద్ మెదక్, ఆదిలాబాద్ పట్టభద్రులు, టీచర్స్ శాసన మండలి సభ్యుల స్థానానికి , ఉమ్మడి నల్గొండ ఖమ్మం వరంగల్ ఉపాధ్యాయుల స్థానానికి ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసిందని అన్నారు.
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో ఎన్నికలు జరిగే జిల్లాల వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి కట్టుదిట్టంగా అమలు చేయాలని, 24 గంటలు , 48 గంటలు, 72 గంటలలో తీసుకోవాల్సిన చర్యల పై రిపోర్ట్ అందించాలని అన్నారు. రాజకీయ పార్టీలకు సంబంధించిన హోల్డింగులు,గోడ రాతలు, జెండాలు, ప్రకటనలు తొలగించాలని, ఎన్నికల ప్రవర్తన నియమావళి నిబంధనలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని అన్నారు.శాసనమండలి ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ఫిబ్రవరి 3న విడుదల చేయడం జరుగుతుందని , ఫిబ్రవరి 3 నుంచి ఫిబ్రవరి 10 వరకు నామినేషన్ల స్వీకరణ, ఫిబ్రవరి 11న స్క్రూట్ ని, ఫిబ్రవరి 13 లోపు ఉపసంహరణ గడువు ఉంటుందని, ఫిబ్రవరి 27న పోలింగ్ జరుగుతుందని, మార్చి 3న ఫలితాలు ఉంటాయని తెలిపారు.ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి తుది ఓటర్ల జాబితా తయారు చేయాలని, పెండింగ్ లో ఉన్న టీచర్స్, పట్టభద్రుల ఓటరు దరఖాస్తులను పరిశీలించి ఫిబ్రవరి 7 లోపు పరిష్కరించాలని సీఈఓ అధికారులకు ఆదేశించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ప్రతి జిల్లాలో ఎంసిఎంసి కమిటీలను వెంటనే ఏర్పాటు చేసి పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా, సామాజిక మీడియాలలో వచ్చే ప్రసారాలను పరిశీలించాలని అన్నారు.
ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు కట్టుదిట్టంగా జరగాలని, ఎక్కడా ఎటువంటి అలసత్వం ఉండటానికి వీలు లేదని అన్నారు. పోలింగ్ కేంద్రాలను పరిశీలించి అక్కడ అవసరమైన వసతులు కల్పించాలని, ఫిబ్రవరి 27న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా అవసరమైన ఏర్పాట్లు చేసే సన్నద్ధంగా ఉండాలని అన్నారు. ఎన్నికల నిర్వహణ సమయంలో ప్రచారానికి అవసరమైన అనుమతులను నిబంధనలను ప్రకారం జారీ చేయాలని అన్నారు. ఎన్నికల సిబ్బందికి అవసరమైన శిక్షణ అందించేందుకు మాస్టర్ ట్రైనర్లను గుర్తించాలని తెలిపారు. బ్యాలెట్ డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్లకు అనువైన ప్రదేశాలను ఎంపిక చేయాలని, ఎన్ని జంబో బ్యాలెట్ నార్మల్ బ్యాలెట్ బాక్సులు ఉన్నాయో సరి చూసుకోవాలని అన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం కు ప్రిసైడింగ్ అధికారి, 3 పోలింగ్ అధికారులు ఉండే విధంగా సిబ్బందిని గుర్తించాలని అన్నారు. శాసన మండలి సభ్యుల ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయలేని మారుమూల ప్రాంతాల్లో పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించ వచ్చని అన్నారు. ఎన్నికలు విధులు నిర్వహించే సిబ్బందికి సర్టిఫికెట్లు జారీ చేసి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించాలని అన్నారు.
వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న అదనపు జిల్లా కలెక్టర్ డి. వేణుగోపాల్ మాట్లాడుతూ , జిల్లాలో ఉపాధ్యాయులకు సంబంధించి 23 పోలింగ్ కేంద్రాల పరిధిలో 1949 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. దీనిలో పురుషులు1038 మరియు మహిళలు 911 మంది ఉన్నారని తెలిపారు. ఎన్నికల కమిషన్ తుది జాబితా అనంతరం ఉపాధ్యాయ ఓటర్ నమోదు దరఖాస్తులు 108 ఉన్నాయని, అందులో 47 ఆమోదించబడినవని,27 దరఖాస్తులు తిరస్కరించబడిన అని తెలిపారు. అధికారుల వద్ద 34 ఉపాధ్యాయుల ఓటర్ నమోదు దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని, వీటిని పరిశీలించి సకాలంలో పంపించడం జరుగుతుందని అన్నారు. జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళికు సంబంధించిన నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామని అన్నారు.
ఈ సమావేశంలో జడ్పీ సీఈవో నాగలక్ష్మి, భద్రాచలం ఆర్డీవో దామోదర్ రావు, సి పి ఓ సంజీవరావు, ఎన్నికల సూపర్డెంట్ ధార ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now