జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.
ప్రశ్న ఆయుధం న్యూస్ ఫిబ్రవరి 13 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఆనంద ఖని,కొత్తగూడెం లోని ఎడ్యుకేషనల్ ట్రైనింగ్ సెంటర్ నందు గ్రామపంచాయతీ ఎన్నికల స్టేజ్ 1 రిటర్నింగ్ అధికారులు మరియు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ శిక్షణ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్నికల అధికారులందరూ శిక్షణా కార్యక్రమంలో అన్ని విషయాల పట్ల అవగాహన కల్పించుకొని, ఎటువంటి సందేహాలకు తావు లేకుండా పారదర్శకంగా ఎన్నికలను నిర్వహించాలని సూచించారు.జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి మాట్లాడుతూ, మండల స్థాయిలో పిఓ లకు ఏపీవోలకు త్వరలోనే శిక్షణను అందిస్తామని, మండల స్థాయి అధికారులు అందరూ సంబంధిత శిక్షణను పూర్తిస్థాయిలో విజయవంతం అయ్యే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.
జిల్లా పంచాయతీ ఎన్నికల ట్రైనింగ్ నోడల్ అధికారి నగిన సతీష్ కుమార్ మాట్లాడుతూ, కొత్తగూడెం డివిజన్ మరియు భద్రాచలం డివిజన్ లో ఉన్న 409 మంది రిటర్నింగ్ మరియు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు ఈరోజు ఇక్కడ శిక్షణ జరుగుతుందని, డివిజన్ వారీగా ఏర్పాటు చేసిన వాట్సప్ గ్రూపులలో సంబంధిత ఆర్వోలు మరియు ఏ ఆర్ ఓ లు జాయిన్ అయి, గ్రూపులో వారికి వచ్చేటువంటి సందేహాలను నివృత్తి చేసుకోవాల్సిందిగా సూచించారు.
ఈ కార్యక్రమంలో డి ఎల్ పి ఓ లు సుధీర్ కుమార్, రమణ, విద్యాశాఖ కోఆర్డినేటర్లు ఎస్.కె. సైదులు, నాగరాజశేఖర్, మాస్టర్ ట్రైనీలు సాయి కృష్ణ, శ్రీనివాసరావు, చలపతి రాజు, దుర్గ శైలజ, స్వరూప్ కుమార్, బి.వి.ఎల్.కుమార్, ఆనంద్ కుమార్ స్వామి, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
గ్రామపంచాయతీ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి.
by Naddi Sai
Published On: February 13, 2025 7:25 pm
