నేతి శ్రీనివాస్ కు ఆహ్వాన పత్రిక అందజేసిన అంజయ్య స్వామి
గజ్వేల్, 17 ఫిబ్రవరి 2025 : సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ ఆర్యవైశ్య నాయకులు లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు నేతి శ్రీనివాస్ కు యాదాద్రి భువనగిరి జిల్లా కాచారం రేణుక ఎల్లమ్మ దేవాలయం వార్షికోత్సవ వేడుకలకు రావాల్సిందిగా సోమవారం నాడు ఆహ్వాన పత్రిక అందజేసిన శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం వ్యవస్థాపక అధ్యక్షులు వంగపల్లి అంజయ్య స్వామి. అనంతరం వారు మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లా కాచారంలో శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం వార్షికోత్సవ వేడుకలు ఆదివారం అనగా 23-02-2025 రోజున నిర్వహించే వార్షికోత్సవ వేడుకలకు రావాల్సిందిగా నేతి శ్రీనివాస్ కు ఆహ్వాన పత్రిక అందజేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు.