సుజాతనగర్ పి ఎం శ్రీ పాఠశాల విద్యార్థులు విహారయాత్ర

ప్రశ్న ఆయుధం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండల ప్రతినిధి ఫిబ్రవరి 25

సుజాతనగర్ మండల
కేంద్రంలోని పి ఎం శ్రీ జడ్ పి హెచ్ ఎస్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు విహార యాత్రకు బయలుదేరి వెళ్లారు వారి వెంట ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు అలాగే స్కూల్ సిబ్బంది తదితరులు విద్యార్థుల వెంట ఉన్నారు ఈ సందర్భంగా స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు కే పూర్ణమ్మ మాట్లాడుతూ
విద్యార్థులకు విహార యాత్రలు నిర్వహించడం వల్ల వారిలో నైపుణ్యాలు పెరుగుతాయని శాస్త్రసాంకేతిక రంగాలపై ఆసక్తి పెరుగుతుందిఅని అలాగే విభిన్నమైన సంస్కృతులు సంప్రదాయాలను పరిచయం చేయడం వల్ల వారికి ప్రత్యేకమైన అనుభవం లభిస్తుంది అన్నారు చారిత్రక ప్రదేశాలు ఉత్సాహభరితమైన నగరాలు విచిత్రమైన గ్రామాలను సందర్శించేటప్పుడు విభిన్న సంస్కృతులు సంప్రదాయాలు ఒక ప్రత్యేకమైన అభ్యాస అనుభవాన్ని అందిస్తుంది పూర్ణమ్మ మాట్లాడుతూ విద్యార్థి దశలో గడిపిన మధుర క్షణాలు గుర్తుండిపోతాయని అందుకే ప్రతి కళాశాల విహార యాత్రలను విధిగా చేపట్టాలన్నారు విద్య ఉపాధి చైతన్యాన్ని కలిగించడంతో పాటు ఉల్లాసాన్ని కూడా ఇవ్వాలన్నారు 350 మంది విద్యార్థినులను వరంగల్ జిల్లాలోని కొన్ని దేవాలయాలకు అలాగే కొన్ని చారిత్రాత్మక కట్టడాలను చూపించడానికి ప్రత్యేక బస్సుల్లో విహార యాత్రకు తీసుకువెళ్లారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు విద్యార్థులు స్కూల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now