బోరుగడ్డ అనిల్పై ఏపీ హైకోర్టు సీరియస్
Mar 12, 2025,
బోరుగడ్డ అనిల్పై ఏపీ హైకోర్టు సీరియస్
ఆంధ్రప్రదేశ్ : YCP నాయకుడు బోరుగడ్డ అనిల్పై హైకోర్టు సీరియస్ అయింది. అనిల్ గడువు సమయంలో లొంగిపోయేందుకు జైలుకు రాలేదని అధికారులు మంగళవారం హైకోర్టుకు సమాచారం ఇచ్చారు. గడువులోగా లొంగిపోయేందుకు రాలేదు. తన తల్లికి ఆరోగ్యం బాగోలేదని చెబుతూ మధ్యంతర బెయిల్ను పొడిగించుకున్నారు. కానీ అనిల్ తల్లికి శస్త్రచికిత్స జరిగినప్పుడు ఆమె వెంట లేడని పోలీసులు నిర్ధారించుకున్నారు. మరోమారు బెయిల్ పొడిగించాలని పిటిషన్ వేయగా, హైకోర్టు నిరాకరించింది.