ఢీ కొట్టిన కారు.. తలకిందులుగా వేలాడిన మహిళ
మంగళూరులో తన పక్కింట్లో ఉండే మురళీ ప్రసాద్ అనే వ్యక్తి బైక్ పై వెళ్తున్న సమయంలో సతీశ్ అనే వ్యక్తి.. కారుతో గుద్ది హత్యాయత్నం చేశారు. అయితే అదే సమయంలో అటుగా వెళ్తోన్న మహిళను కూడా కారు ఢీ కొట్టింది.
కారు స్పీడ్ కు మహిళ.. ఓ ఇంటి గోడపై పల్టీ కొట్టి వేళాడింది. దీంతో స్థానికులు ఆమెను కిందకు దించారు. ఇటు ఈ ప్రమాదంలో మహిళతో పాటు.. మురళికి కూడా గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో సతీష్ను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. గతంలో కూడా మురళి తండ్రిపైనా సతీశ్ హత్యాయత్నం చేసినట్లు తెలుస్తోంది.