మార్చి నెలలోనే భానుడు భగభగ
మార్చి నెలలోనే భానుడు భగభగమంటున్నాడు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే ముందు ముందు పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వేసవి తొలి రోజులలోనే ఏపీలో ఎండల తీవ్రత పెరగడం ఆందోళన కలిగిస్తుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం మూడున్నర గంటల వరకు విపరీతమైన ఎండ తీవ్రత ఉంటుంది. ప్రజలు రోడ్లమీదకి రావాలంటేనే భయపడుతున్న పరిస్థితులు ఉన్నాయి.