పదవీ విరమణ కార్మికునికి సహోద్యోగుల కార్మిక సంఘాల ఘన సన్మానం

ప్రశ్న ఆయుధం న్యూస్ మార్చి 24

కొత్తగూడెం డివిజన్ ఆర్ సి

సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియా పీకే ఓసీలో నలభై సంవత్సరాలపాటు సీనియర్ ఈపి ఫిట్టర్ గా పనిచేసి పదవీ విరమణ చేసిన సింగరేణి కార్మికులు సి ఐ టి యు ఏరియా అధ్యక్షులు టీ వి వి వర ప్రసాదరావు, సత్యవాణి దంపతుల దంపతులను పీ వీ కాలనీ గోల్డెన్ ఫంక్షన్ హాల్ లో సింగరేణి అధికారులు షావెల్స్ అండ్ డ్రిల్స్ సెక్షన్ సహోద్యోగులు కార్మిక సంఘాల, రాజకీయ పార్టీల , ప్రజా సంఘాల, బంధుమిత్రుల ఆధ్వర్యంలో శాలువా పూలమాలలు , బహుమతులు, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు, సిఐటియు ఏరియా కార్యదర్శి వల్లూరు వెంకటరత్నం అధ్యక్షతన జరిగిన సభల పలువురు నాయకులు, అధికారులు మాట్లాడుతూ నలభై సంవత్సరాలపాటు సింగరేణి కార్మికునీగా సింగరేణి సంస్థకు సేవలు అందించటంతో పాటు సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు)నాయకునిగా ఏరియా అధ్యక్షుడిగా మరియు సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించిన పలు కార్మిక ,ప్రజా పోరాటాలలో చురుకైన పాత్రను పోషించారని కొనియాడారు. తోటి కార్మికులతోపాటు అన్ని కార్మిక సంఘాలతో వివిధ రాజకీయ పార్టీల నాయకులతో కూడా ఆయన చక్కటి స్నేహ సంబంధాలు కొనసాగించారని “అజాతశత్రువు సిఐటియు ప్రసాద్” అని ప్రశంసించారు.ఆయన విశ్రాంత జీవితం ఆనందమయం కావాలని ఆకాంక్షిస్తూ దంపతులిద్దరికీ పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో , ఏరియా ఇంజనీర్ ఆర్ శ్రీనివాస్,ఇంజనీర్లు ప్రవీణ్, సుధీర్,విజయరావు, కుమార్ ,సిపిఎం సిఐటియు రాష్ట్ర, జిల్లా నాయకులు అన్నవరపు కనకయ్య,బ్రహ్మచారి, నెల్లూరి నాగేశ్వరరావు, హైమావతి,వి వెంకటరత్నం, ఎం లక్ష్మణరావు,గద్దల శ్రీనివాస్, కొడిశెల రాములు,సత్రపల్లి సాంబ, నిమ్మగడ్డ లక్ష్మణరావు, వెంకట్రావు,టిడిపి నాయకులు వాసిరెడ్డి చలపతిరావు వట్టం నారాయణ, కార్మిక నాయకులు ఏఐటీయూసీ నుండి మేకల ఈశ్వర్,ఆవుల నాగరాజు, ఎస్ కుమారస్వామి, సురేందర్, ఐ ఎన్ టి యు సి నుండి బుర్ర వెంకటేశ్వర్లు,మల్లికార్జున్, కార్మిక నాయకులు వూకంటి ప్రభాకర్ రావు, శివాజీ, కలగూర శంకర్, అసంఘటిత రంగం నాయకులు వెలగ పల్లి జాన్,భోగ రాయలింగు , శ్రీలత, దరిసా రమేష్, (హెచ్ఎంఎస్) యస్ డి నా సర్ పాషా, ఏ మంగీలాల్ ఐ ఎఫ్ టి యు షావేల్స్& డ్రిల్స్ సెక్షన్ కార్మికులు కృష్ణారావు రామారావు కోటేశ్వరరావు పెద్ద ఎత్తున ఉద్యోగులు బంధుమిత్రులు ప్రజాసంఘాల కార్యకర్తలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now