జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి. భానుమతి
ప్రశ్న ఆయుధం న్యూస్ మార్చి 29
కొత్తగూడెం డివిజన్ ఆర్ సి
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి.భానుమతి శనివారం స్పెషల్ సబ్ జైలు భద్రాచలంను సందర్శించారు. ఈ సందర్భంగ విచారణ ఖైదీలతో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడుతూ క్షణికావేశం లో చేసిన నేరాలతో ఖైదీలుగా మారి జైలు జీవితం గడపాల్సి వస్తుందని తద్వారా తమ విలువైన భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారని అన్నారు. విచారణ ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలని తెలిపారు. ఈ సందర్భంగ జైలులో ఉన్నటువంటి ఖైదీలకు విచారించి న్యాయవాదిని నియమించుకునే స్తోమత లేని ఖైదులకు ఉచితంగా న్యాయవాదిని నియమించనున్నట్లు తెలిపారు. జైలు పరిసరాలు, ఖైదీలకు వడ్డించే ఆహారం, సదుపాయాలు,ఆరోగ్య పరిస్థితిల గురించి విచారించారు. ఖైదీలలో మార్పుకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ పి.నిరంజన్ రావు పాల్గొన్నారు.