జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు
ప్రశ్న ఆయుధం న్యూస్ ఏప్రిల్ 5
కొత్తగూడెం డివిజన్ ఆర్ సి
శనివారం మిథిలా స్టేడియంలో సెక్టార్ అధికారు లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కళ్యాణ వేడుకలు ప్రశాంతంగా జరగడానికి సెక్టార్ అధికారులు విధులు అత్యంత కీలకమని తెలిపారు. 6వ తేదీ ఆదివారం ఉదయం ఉదయం 5.30 గంటలకు సెక్టార్ అధికారులు, సిబ్బంది కేటాయించిన సెక్టార్ విధులకు హాజరు కావాలని సూచించారు. సెక్టార్ అధికారులు నిర్వహించే విధులపై క్లారిటీ ఉండాలని స్పష్టం చేశారు. భక్తులు ఒక సెక్టార్ నుండి మరొక సెక్టార్ లోకి రాకుండా పటిష్ట పర్యవేక్షణ చేయాలని తెలిపారు. ఒక సెక్టార్ నుండి మరొక సెక్టార్ లోకి భక్తులు రావడం వల్ల రద్దీ పెరుగుతుందని భక్తులు ఇబ్బందులు పడతారని అన్నారు. తలంబ్రాలు మిథిలా స్టేడియంలో తలంబ్రాలు ఇవ్వబడవని, తలంబ్రాలు కొరకు పట్టణంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు ద్వారా ఉచిత పంపిణీకి ఏర్పాట్లు చేశామని భక్తులు గమనించి యంత్రాంగానికి సహకరించాలని సూచించారు. ప్రతి సెక్టార్ లో మంచినీరు, మజ్జిగ పంపిణీ చేస్తున్నామని తెలిపారు. అలాగే వైద్య సిబ్బంది ద్వారా ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. భక్తులు అస్వస్థతకు గురైతే తక్షణమే వైద్య సేవలు అందించే విధంగా ఏర్పాట్లు చేశామని అన్నారు. టికెట్ ఉన్న భక్తులను మాత్రమే కళ్యాణ మండపంలోకి అనుమతించాలని, టికెట్ లేకుండా రానిస్తే సెక్టార్ అధికారు లపై కఠిన చర్యలు తీసుకుంటామని సూచించారు.
ఎండ దృష్ట్యా భక్తులకు ఉపశమనం కలగడానికి ప్రత్యేకంగా మిస్ట్ ఫాగర్స్ ఏర్పాటు చేశామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఐటిడీపీ పిఓ రాహుల్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, ఆర్డిఓ దామోదర్ సెక్టార్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.